యాప్నగరం

జియో: రూ. 399 రీఛార్జ్‌తో రూ.2599 క్యాష్ బ్యాక్

ప్రైమ్ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో తొలిసారిగా వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. రూ. 399, అంత కంటే ఎక్కువ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే..

TNN 10 Nov 2017, 3:19 pm
ప్రైమ్ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో తొలిసారిగా వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. రూ. 399, అంత కంటే ఎక్కువ మొత్తంతో రీచార్జ్ చేసుకునే వారికి రూ. 2599 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ వోచర్లో జియో పార్ట్‌నర్ వ్యాలెట్లను ఉపయోగించి రీచార్జ్ చేసుకుంటే రూ. 300 ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఇస్తామని తెలిపింది. అమెజాన్ పే, యాక్సిస్ పే, ఫ్రీఛార్జ్, మొబీక్విక్, పేటీఎం, ఫోన్‌పే‌ యాప్‌లలో వేటినైనా ఇందుకోసం వినియోగించొచ్చు.
Samayam Telugu reliance jio announces triple cash back offer for prime members
జియో: రూ. 399 రీఛార్జ్‌తో రూ.2599 క్యాష్ బ్యాక్


ఈ ప్రత్యేకమైన ఆఫర్ నవంబర్ 10 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్‌ను మూడు కేటగిరీలుగా జియో విభజించింది. రూ. 400 విలువైన జియో క్యాష్ బ్యాక్ వోచర్లను మైజియో ద్వారా నవంబర్ 15 నుంచి రెడెంప్షన్ చేసుకోవచ్చు. పార్ట్‌నర్ వ్యాలెట్ల ద్వారా పొందే క్యాష్ బ్యాక్‌ను వెంటనే యూజర్ల వ్యాలెట్లో క్రెడిట్ అవుతాయి. ఈ కామర్స్ వోచర్లు నవంబర్ 20 నుంచి అందుబాటులో ఉంటాయి. రూ. 99తో రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ప్రైమ్ మెంబర్లుగా కొనసాగే అవకాశాన్ని జియో కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.