యాప్నగరం

మళ్లీ మొదలైన జియో, ఎయిర్‌టెల్ పోరు!

భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది.

TNN 8 Feb 2017, 6:54 pm
భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో కంపెనీల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇంటర్ కనెక్ట్ పాయింట్స్, కాల్ ఫెయిల్యూర్స్ విషయంలో భారత నంబర్ 1 టెలీకాం కంపెనీ అయిన ఎయిర్‌టెల్‌పై జియో మండిపడుతోంది. వాస్తవానికి ఈ విషయంపై టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతేడాది అక్టోబర్‌లో ఎయిర్‌టెల్‌కు చీవాట్లు పెట్టింది. జియో నుంచి మీ నెట్‌వర్క్‌కు వస్తున్న కాల్స్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని, నిబంధనల ప్రకారం సరిపడా ఇంటర్‌ కనెక్ట్ పాయింట్లు ఇవ్వాలని ఆదేశించింది.
Samayam Telugu reliance jio blames airtel for over 50 of call drops on its network
మళ్లీ మొదలైన జియో, ఎయిర్‌టెల్ పోరు!


దీనిపై ఎయిర్‌టెల్ మంగళవారం ఓ నివేదికను ట్రాయ్‌కి అందజేసింది. తమ నెట్‌వర్క్‌పై జియోకు 35వేల ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఇచ్చామని, ఇవి కనీసం 190 మిలియన్ కస్టమర్లకు సరిపోతాయని వివరించింది. జియోకు ప్రస్తుతం 73 మిలియన్ వినియోగదారులు ఉన్నారు కాబట్టి ఇది చాలా ఎక్కువని నివేదించింది. అయితే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దీనిపై ఘాటుగా స్పందించింది.

ఎయిర్‌టెల్ చెప్పేవన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది. ఎయిర్‌టెల్ కారణంగా తమ నెట్‌వర్క్‌లో రోజుకి 2.6 కోట్ల కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని జియో ఆరోపించింది. జనవరి 31 నాటికి ఎయిర్‌టెల్ ద్వారా తమ నెట్‌వర్క్‌లో 53.4 శాతం కాల్స్ ఫెయిలయ్యాయని, ట్రాయ్ నిబంధనల ప్రకారం చూస్తే ఇది చాలా ఎక్కువని మండిపడింది. వాస్తవానికి ట్రాయ్ నిబంధనల ప్రకారం రోజుకి 0.5 శాతానికి మించి కాల్స్ ఫెయిల్ కాకూడదు. అయితే జియో ఆరోపణలపై ఎయిర్‌టెల్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.