యాప్నగరం

రిలయన్స్ జియోని సగం మంది వదిలేశారు!

భారత టెలీకాం మార్కెట్‌ను షేక్ చేసిన ముఖేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లు మరో ఒక రోజులో ముగియనున్నాయి.

TNN 30 Mar 2017, 7:26 pm
భారత టెలీకాం మార్కెట్‌ను షేక్ చేసిన ముఖేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లు మరో ఒక రోజులో ముగియనున్నాయి. జియోకి ఉన్న 10 కోట్లకు పైగా కస్టమర్లు మరో 24 గంటలపాటు మాత్రమే జియో అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, మొబైల్ డాటాను వాడుకోగలరు. మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల తరవాత ‘జియో ప్రైమ్’ రంగంలోకి దిగుతుంది. అయితే ఈ ‘జియో ప్రైమ్’లో ప్రస్తుతానికి సుమారు 5 కోట్ల మంది మాత్రమే చేరారు. అంటే ఉచితంగా జియో సేవలను వాడుకున్న 10 కోట్ల మందిలో సగం యూజర్లు హ్యాండ్ ఇచ్చారు.
Samayam Telugu reliance jio claims nearing 50 million paid subscribers
రిలయన్స్ జియోని సగం మంది వదిలేశారు!


ఏప్రిల్ 1 నుంచి అపరిమిత జియో సేవలను పొందాలంటే రూ. 99 చెల్లించి ‘జియో ప్రైమ్’ చేరాలని కంపెనీ నిబంధన పెట్టింది. ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ఏడాది కాలంలో రూ. 303తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజులపాటు అపరిమిత జియో సేవలు పొందొచ్చు. ప్రస్తుతం అందిస్తోన్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్‌‌లో ఏమైతే బెన్‌ఫిట్స్ ఉన్నాయో అవే రూ. 303 రీచార్జ్‌తో వస్తాయి. కానీ, ఈ జియో ఆఫర్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్ఎల్, ఐడియా తక్కువ టారిఫ్‌తోనే అపరిమిత సేవలు అందిస్తుండటంతో చాలా మంది యూజర్లు జియో వైపు చూడటంలేదు.

మరోవైపు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం తాము పెట్టుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే 50 శాతం చేరుకున్నామని కంపెనీ వెల్లడించింది. వాస్తవానికి దేశంలో ఇదే ఎక్కువ. దేశంలో సుమారు 5 కోట్ల మందికి పెయిడ్ బ్రాండ్‌బ్యాండ్ సర్వీసులు అందిస్తున్న అతిపెద్ద టెలీకాం కంపెనీగా జియో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.