టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్తో ముందుకొచ్చింది. దీపావళి పండగను పురస్కరించుకొని ‘ధన్ ధనా ధన్’ ఆఫర్ను ప్రవేశ పెట్టింది. ఈ ఆఫర్లో రూ. 399తో రీఛార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్బ్యాక్ ఇవ్వనుంది. ఈ క్యాష్బ్యాక్ ఓచర్ల రూపంలో లభిస్తుంది. వీటిని మళ్లీ రీఛార్జ్ చేసుకునేందుకు వాడుకోవచ్చు. గురువారం (అక్టోబర్ 12) నుంచి ప్రారంభమవుతున్న ఈ ఆఫర్ అక్టోబర్ 18 వరకు అందుబాటులో ఉండనుంది. రూ. 399 ఆఫర్తో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఇప్పటికే 84 జీబీ డేటా (రోజుకు 1 జీబీ) ఇస్తున్నారు. దీంతో పాటు ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత కాలింగ్స్ను అందిస్తున్నారు. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 84 రోజులు.
తాజాగా తీసుకొచ్చిన దీపావళి ధన్ ధనా ధన్ ఆఫర్లో భాగంగా.. అక్టోబర్ 12 నుంచి 18 మధ్య రూ. 399తో రీఛార్జ్ చేసుకుంటే.. వారికి రూ.50 విలువ గల 8 ఓచర్లు వస్తాయి. అంటే మొత్తంగా రూ. 400 వస్తుంది. ఈ ఓచర్లను మళ్లీ రీఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే.. నవంబర్ 15 తర్వాత మాత్రమే వినియోగించుకోవాలి.
తాజాగా తీసుకొచ్చిన దీపావళి ధన్ ధనా ధన్ ఆఫర్లో భాగంగా.. అక్టోబర్ 12 నుంచి 18 మధ్య రూ. 399తో రీఛార్జ్ చేసుకుంటే.. వారికి రూ.50 విలువ గల 8 ఓచర్లు వస్తాయి. అంటే మొత్తంగా రూ. 400 వస్తుంది. ఈ ఓచర్లను మళ్లీ రీఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే.. నవంబర్ 15 తర్వాత మాత్రమే వినియోగించుకోవాలి.