యాప్నగరం

‘జియో’ దివాళీ ధన్ ధనా ధన్ ఆఫర్..

టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. దీపావళి పండగను పురస్కరించుకొని ‘ధన్‌ ధనా ధన్‌’ ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ ఆఫర్‌లో రూ. 399తో రీఛార్జ్‌ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల రూపంలో లభిస్తుంది. వీటిని మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేందుకు వాడుకోవచ్చు.

TNN 12 Oct 2017, 11:09 am
టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. దీపావళి పండగను పురస్కరించుకొని ‘ధన్‌ ధనా ధన్‌’ ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ ఆఫర్‌లో రూ. 399తో రీఛార్జ్‌ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల రూపంలో లభిస్తుంది. వీటిని మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేందుకు వాడుకోవచ్చు. గురువారం (అక్టోబర్ 12) నుంచి ప్రారంభమవుతున్న ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 18 వరకు అందుబాటులో ఉండనుంది. రూ. 399 ఆఫర్‌తో ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఇప్పటికే 84 జీబీ డేటా (రోజుకు 1 జీబీ) ఇస్తున్నారు. దీంతో పాటు ఉచిత ఎస్‌ఎంఎస్‌, ఉచిత కాలింగ్స్‌‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ వ్యాలిడిటీ 84 రోజులు.
Samayam Telugu reliance jio diwali dhan dhana dhan offer
‘జియో’ దివాళీ ధన్ ధనా ధన్ ఆఫర్..


తాజాగా తీసుకొచ్చిన దీపావళి ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌లో భాగంగా.. అక్టోబర్‌ 12 నుంచి 18 మధ్య రూ. 399తో రీఛార్జ్‌ చేసుకుంటే.. వారికి రూ.50 విలువ గల 8 ఓచర్లు వస్తాయి. అంటే మొత్తంగా రూ. 400 వస్తుంది. ఈ ఓచర్లను మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే.. నవంబర్‌ 15 తర్వాత మాత్రమే వినియోగించుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.