యాప్నగరం

జియోతో.. రూ.699కే 4జీ స్మార్ట్‌ఫోన్‌..!

జియో.. సరికొత్త ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కూడా సత్తా చాటడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో రూ.699కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.

TNN 19 Feb 2018, 4:11 pm
సంచలన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. రూ.1500 ధరకే మార్కెట్‌లో ప్రవేశపెట్టిన జియో ఫీచర్‌ ఫోన్లకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు సరికొత్త ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కూడా సత్తా చాటడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో రూ.699కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. జీవీ మొబైల్స్ భాగస్వామ్యంతో ఈ ఫోన్లను ప్రవేశపెట్టింది. జీవీ మొబైల్స్‌కు చెందిన 'ఎనర్జీ ఈ3' స్మార్ట్‌ఫోన్‌ను కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఫోన్ ధర రూ.2,899.
Samayam Telugu reliance jio jivi mobiles rs 699 smart phone
జియోతో.. రూ.699కే 4జీ స్మార్ట్‌ఫోన్‌..!


ఈ ఫోన్‌ కొన్నవారు జియో సిమ్‌తో రూ.198 లేదా రూ.299 ప్లాన్‌తో రీచార్జి చేసుకోవాలి. తర్వాత 44 వోచర్ల రూపంలో రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఒక్కో వోచర్ విలువ రూ.50. వీటిని తర్వాత చేసుకునే రూ.198, రూ.299 రీచార్జిలపై వాడుకోవచ్చు. ఈ లెక్కన.. కేవలం రూ.699 ధరకే ఈ ఫోన్ లభించినట్లవుతుంది.

జీవీ కంపెనీకి చెందిన ఇతర మోడళ్లపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. క్యాష్‌బ్యాక్‌తో రూ. 3,199 విలువైన 'ఎనర్జీ ఈ12' స్మార్ట్‌ఫోన్ ధర రూ.999కే లభించనుంది. రూ.4,799 విలువైన 'ప్రైమ్ పీ444' స్మార్ట్‌ఫోన్ ధర కాగా క్యాష్‌బ్యాక్‌తో రూ.2599 ధరకే లభ్యంకానుంది. జియో ఈ ఆఫర్లన్నింటినీ తన 'ఫుట్‌బాల్' ఆఫర్‌లో భాగంగా అందిస్తోంది. ఇతర మొబైల్ ఫోన్లపై కూడా జియో ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తర్వాత రీచార్జ్ చేసుకునేవారికి ఆఫర్ వర్తించదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.