యాప్నగరం

5G Services: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. మరిన్ని నగరాలకు JIO 5G సేవలు.. ఎక్కడెక్కడంటే?

5G Services: దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) గతేడాది తీసుకొచ్చిన 5G క్రమంగా విస్తరించుకుంటూ వెళ్తోంది. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో గతంలోనే 5జీ సేవలను లాంఛ్ చేసినప్పటికీ ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో హోలీ సందర్భంగా తీసుకొచ్చింది. వీటిల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 8 Mar 2023, 9:58 pm
5G Services: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. రిలయన్స్ జియో 5G సేవలను ఇప్పుడు మరిన్ని నగరాల ప్రజలు పొందనున్నారు. దేశీయ ప్రముఖ టెలికాం సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో (JIO 5G) 5జీ సేవలను ఇతర నగరాలకు విస్తరిస్తోంది. శరవేగంగా ఆ పనులు చేసుకుంటూ వెళ్తోంది. గతేడాది నుంచే పలు ముఖ్య నగరాల్లో 5G సేవలను ప్రారంభించిన జియో.. ఇప్పుడు హోలీ పండగను పురస్కరించుకొని మరో 13 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 27 నగరాల్లో 5జీ సర్వీసులను లాంఛ్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 331 నగరాలు/పట్టణాల్లో జియో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయని ఈ దిగ్గజ కంపెనీ వెల్లడించింది. ఇక ఇప్పుడు లాంఛ్ చేసిన నగరాల జాబితాలో తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి.
Samayam Telugu JIO 5G


తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే 5G సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రాష్ట్రంలోని జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, సంగారెడ్డి, నిర్మల్, తాండూరు, సిద్ధిపేట, జహీరాబాద్ ఇలా 8 నగరాల్లో హోలీ రోజున లాంఛ్ చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలోనే ఎక్కువ నగరాల్లో 5G సేవలను తీసుకొచ్చింది JIO. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తాడిపత్రిలో 5G సేవలు ప్రారంభమయ్యాయి.

SBI: ఒక్క మిస్డ్ కాల్‌తో క్షణాల్లో మీ మినీ స్టేట్‌మెంట్ ఫోన్‌కు మెసేజ్.. కావాలంటే వెంటనే ట్రై చేయండి! Ola S1 Pro: ఓలా Holi Offer అదిరిపోయిందిగా.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. ఇంకెన్నో స్పెషల్ బెనిఫిట్స్..!

తెలంగాణ, ఏపీతో పాటు.. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, జమ్ముకశ్మీర్, పశ్చిమ్‌బంగా, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లోని 27 ప్రాంతాల్లో 5G సేవలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల పరిధిలోని కస్టమర్లు జియో వెల్‌కం ఆఫర్ (JIO Welcome Offer) కింద 5G సేవలను పొందొచ్చని జియో వివరించింది. ప్రస్తుతానికి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే.. 1GBPS కంటే ఎక్కువ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఇక 2023 చివరికల్లా దేశవ్యాప్తంగా, మారుమూల ప్రాంతాల్లోనూ జియో 5G సేవలను తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముకేశ్ అంబానీ గతంలోనే ప్రకటించారు.

జియో అఫీషియల్ వెబ్‌సైట్ ప్రకారం.. తెలంగాణ, ఏపీల్లో ఎక్కడెక్కడ ప్రస్తుతం 5G సేవలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదే‌శ్‌లో విశాఖపట్నం, అనంతపురం, అనకాపల్లి, భీమవరం, మచిలీపట్నం, ఏలూరు, చీరాల చిత్తూరు, హిందూపూర్, గుంతకల్, గుంటూరు, కర్నూలు, కడప, కాకినాడ, నంద్యాల్, మదనపల్లి, నెల్లూరు, నరసరావుపేట, ప్రొద్దుటూరు, ఒంగోలు, తెనాలి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తిరుపతి, తిరుమల, విజయనగరం, విజవాడల్లో జియో 5G సర్వీసులు ఉన్నాయి.

Narayana Murthy: భార్యల సంపాదనతోనే వ్యాపారాల్లో అందనంత ఎత్తుకు.. వారి డబ్బుతోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్..! EPFO: ఒక్క నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ మీ ఫోన్‌కు మెసేజ్.. ఇప్పుడే ట్రై చేయండి!

ఇక తెలంగాణలో చూస్తే గనుక ఇదివరకే Hyderabad, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల, వరంగల్, రామగుండం పట్టణాల్లో 5G సేవలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒకేసారి తెలంగాణలో మరో 8 నగరాలకు 5G సేవలు విస్తరించింది జియో.

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.