యాప్నగరం

జియోది దౌర్జన్యం: ఎయిర్‌టెల్ చైర్మన్

భారత్‌లోనే అతిపెద్ద టెలీకాం నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్ మరోసారి రిలయన్స్ జియోపై విరుచుకుపడింది.

TNN 28 Feb 2017, 5:22 pm
భారత్‌లోనే అతిపెద్ద టెలీకాం నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్ మరోసారి రిలయన్స్ జియోపై విరుచుకుపడింది. జియో ప్రైమ్ పేరిట కొత్తగా టారిఫ్ ప్లాన్లు ప్రకటించడం దౌర్జన్యమని, భరించలేని చర్య అని ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. దీనిపై టెలీకాం పరిశ్రమ కచ్చితంగా స్పందిస్తుందని, మరింత పోటీతో కొత్త ప్లాన్లు, అడిషనల్ డాటా ఆఫర్లు వస్తాయని ఆయన అన్నారు.
Samayam Telugu reliance jio primes tariff are unsustainable airtel chairman sunil mittal
జియోది దౌర్జన్యం: ఎయిర్‌టెల్ చైర్మన్


జియో ఉచిత వాయిస్ కాల్స్, రోమింగ్ సేవలకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా రోమింగ్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కాగా, వైర్‌లెస్ 4జీ నెట్‌వర్క్ విస్తరణ కోసం జియో ఏకంగా 25 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. ఏప్రిల్ 1 నుంచి జియో ప్రైమ్ పేరుతో ఉచిత సేవలు కొనసాగిస్తామని అయితే దానికోసం రూ. 99లతో సభ్యత్వం పొందాలని జియో ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్‌నే ఇకపై కొనసాగించాలంటే నెలకి రూ. 303 టారిఫ్‌తో రీచార్జ్ చేయించుకోవాలని కూడా వెల్లడించింది.

అయితే జియో ప్రకటించిన ఆఫర్లపై సునీల్ మిట్టల్ మంగళవారం స్పందించారు. జియో చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా చేయడం వల్ల భారత టెలీకాం పరిశ్రమ ఆర్థికంగా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో స్పెక్ట్రం రేట్లు కూడా విపరీతంగా పెరిగాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.