ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ఉబర్ జతకట్టింది. దీని ద్వారా రిలయన్స్ పేమెంట్స్ సొల్యూషన్స్ లిమిటెడ్కు చెందిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPI) వాలెట్.. జియోమనీని ఇకపై ఉబెర్ రైడ్ పేమెంట్స్ కోసం ఉపయోగించొచ్చు. ఇకమీదట ఉబెర్ యాప్లో పేమెంట్స్ ఆప్షన్ దగ్గర జియోమనీ వాలెట్ కూడా చూపిస్తుంది.
ఫిబ్రవరి 20 నుంచే జియోమనీ పేమెంట్ ఆప్షన్ను తీసుకొచ్చిన ఉబెర్ దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఈ సర్వీసును వ్యాపింపజేస్తోంది. ‘జియో ఈకోసిస్టమ్లో జియోమనీ కూడా భాగం. చాలా సులభంగా డిజిటల్ లావేదేవీలు జరపడానికి జియోమనీ అనుకూలంగా ఉంటుంది. జియోమనీతో డిజిటల్ ప్లాట్ఫాంపై ఉబెర్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి’ అని జియోమనీ బిజినెస్ హెడ్ అనిర్బన్ ఎస్. ముఖర్జీ అన్నారు. ‘భారత యూజర్లకు వేగవంతమైన డిజిటల్ సొల్యూషన్స్ను అందించడానికే మేము ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాం’ అని ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్ చెప్పారు.
కాగా, జియోమనీ వాలెట్పై ఉబెర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ప్రాంతాలను బట్టి జియో మనీతో పేమెంట్ చేసిన వారికి రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.
ఫిబ్రవరి 20 నుంచే జియోమనీ పేమెంట్ ఆప్షన్ను తీసుకొచ్చిన ఉబెర్ దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ఈ సర్వీసును వ్యాపింపజేస్తోంది. ‘జియో ఈకోసిస్టమ్లో జియోమనీ కూడా భాగం. చాలా సులభంగా డిజిటల్ లావేదేవీలు జరపడానికి జియోమనీ అనుకూలంగా ఉంటుంది. జియోమనీతో డిజిటల్ ప్లాట్ఫాంపై ఉబెర్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి’ అని జియోమనీ బిజినెస్ హెడ్ అనిర్బన్ ఎస్. ముఖర్జీ అన్నారు. ‘భారత యూజర్లకు వేగవంతమైన డిజిటల్ సొల్యూషన్స్ను అందించడానికే మేము ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాం’ అని ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్ చెప్పారు.
కాగా, జియోమనీ వాలెట్పై ఉబెర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ప్రాంతాలను బట్టి జియో మనీతో పేమెంట్ చేసిన వారికి రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.