యాప్నగరం

నెట్ స్పీడ్ కోసం 45 వేల కొత్త జియో టవర్లు

టెలీకాం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన జియో మరో 45 వేల టవర్ల ఏర్పాటు ద్వారా తమ కస్టమర్ల సమస్యలను తీర్చాలని భావిస్తోంది.

TNN 3 Nov 2016, 4:47 pm
టెలీకాం మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్ జియో మరో ఆరు నెలల్లో 45 వేల మెబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హాను కలుసుకొని టవర్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కంపెనీ వర్గాలు తెలిపాయి. రెండు నెలల్లోనే జియోకు 24 లక్షల మందికిపైగా కస్టమర్లు జతయ్యారు. వినియోగదారులు విపరీతంగా పెరగడంతో డేటా స్పీడ్ తక్కువ ఉండటం, కాల్ కనెక్టవిటీ సమస్యలు వేధిస్తున్నాయి. ఈ విషయమై ఆ సంస్థకు ఫిర్యాదులు వెల్లువ వస్తున్నాయి. దీంతో ఈ సమస్యల పరిష్కారంపై జియో దృష్టి సారించింది. వచ్చే నాలుగేళ్లలో టెలికం వ్యాపారాన్ని విస్తరించడానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే నూతన టవర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది.
Samayam Telugu reliance jio will build 45 thousand mobile towers to improve internet speed
నెట్ స్పీడ్ కోసం 45 వేల కొత్త జియో టవర్లు


దేశవ్యాప్తంగా 18 వేల పట్టణాల్లో 2.82 లక్షల జియో టవర్ల ఏర్పాటు కోసం ముకేశ్ అంబానీ ఇప్పటికే రూ.1.6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇంటర్ కనెక్షన్ పాయింట్లను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు కేటాయించడం లేదనే కారణంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు ట్రాయ్ రూ.3,050 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.