యాప్నగరం

జియో పెద్ద ప్లాన్‌తోనే వచ్చింది!

అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, డాటా సర్వీసులతో దూసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పెద్ద ప్లాన్‌తోనే బరిలోకి దిగింది.

TNN 5 Mar 2017, 1:54 pm
అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, డాటా సర్వీసులతో దూసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పెద్ద ప్లాన్‌తోనే బరిలోకి దిగింది. దేశంలోని టెలీకాం మార్కెట్‌లో 50 శాతం షేర్ సొంతం చేసుకోవాలని జియో చూస్తోంది. డాటా వినియోగంతో ఇతర సేవల నాణ్యతను పెంచడం ద్వారా ఈ టార్గెట్‌ను చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ స్థాపించిన ఈ కంపెనీ ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద టెలీకాం ఆపరేట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోన్న విషయం తెలిసిందే.
Samayam Telugu reliance jios big plan to capture over 50 of indias mobile market in 3 4 years
జియో పెద్ద ప్లాన్‌తోనే వచ్చింది!


అయితే కంపెనీ భవిష్యత్తు ప్రణాళికపై ఇటీవల మార్కెట్ విశ్లేషకులకు జియో ఒక ప్రజంటేషన్ ఇచ్చింది. ఫైనాన్సియల్ టార్గెట్‌లను ఎప్పటిలోగా అందుకోవాలి అనే విషయాన్ని జియో కచ్చితంగా వెల్లడించనప్పటికీ, 200-21 నాటికి 50 శాతం షేర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా, గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ 33.1 శాతం మార్కెట్ షేర్ సొంతం చేసుకోగా, వొడాఫోన్ ఇండియా 23.5 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఐడియా సెల్యులర్ 18.7 శాతం మార్కెట్ షేర్ సొంతం చేసుకుంది.

ఇక టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్ఎల్), ఎయిర్‌సెల్, రిలయన్స్ కమ్యునికేషన్స్ వరసగా 6.2 శాతం, 5.5 శాతం, 4 శాతం మార్కెట్ షేర్ సాధించాయి. అంటే భారత్‌లో నంబర్ వన్ టెలీకాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి ఆ స్థానంలోకి వెళ్లాలని జియో ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఏ టెలీకాం సంస్థకు సాధ్యంకాన్ని మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుని తమకు తిరుగులేదని నిరూపించాలని చూస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.