ఎంట్రీ లెవెల్ విభాగంలో మారుతీ అల్టోకు గట్టి పోటీ ఇస్తున్న క్విడ్ కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ రెనో తన ‘క్విడ్’ మోడల్ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు 3 శాతం పెరుగుతాయని పేర్కొంది. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. రెనో క్విడ్ కార్లు 0.8 లీటర్ నుంచి 1.0 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయి. మ్యానువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో ఇవి లభ్యమౌతున్నాయి. రెనో కారును మార్కెట్లోకి తీసుకువచ్చిన దగ్గరి నుంచి కంపెనీ 2,75,000 యూనిట్లను విక్రయించింది. అయితే గత కొన్ని నెలలుగా క్విడ్ కార్ల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి.
ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీ ఇటీవలే పలు భద్రతా ఫీచర్లతో సరికొత్త రెనో కారును మార్కెట్లో లాంచ్ చేసింది. రెనో క్విడ్ కార్ల ధర ప్రస్తుతం రూ.2.66 లక్షల నుంచి రూ.4.63 లక్షల మధ్య ఉంది. మరోవైపు టాటా మోటార్స్ కూడా ప్యాసింజర్ వాహన ధరలను ఏప్రిల్ 1 నుంచి రూ.25,000 మేర పెంచుతున్నట్లు గతవారంలోనే నిర్ణయం తీసుకుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీ ఇటీవలే పలు భద్రతా ఫీచర్లతో సరికొత్త రెనో కారును మార్కెట్లో లాంచ్ చేసింది. రెనో క్విడ్ కార్ల ధర ప్రస్తుతం రూ.2.66 లక్షల నుంచి రూ.4.63 లక్షల మధ్య ఉంది. మరోవైపు టాటా మోటార్స్ కూడా ప్యాసింజర్ వాహన ధరలను ఏప్రిల్ 1 నుంచి రూ.25,000 మేర పెంచుతున్నట్లు గతవారంలోనే నిర్ణయం తీసుకుంది.