Reserve Bank Of India Curbs On Bengaluru Private Bank From Doing Business
రూ.35,000 మించి డబ్బు విత్డ్రా చేసుకోవడం కుదరదు.. బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్!
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలో బ్యాంకులపై పూర్తి నిఘా పెట్టినట్లు ఉంది. ఆర్థిక అంశాలకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగకుండా ముందు నుంచే అప్రమత్తతో వ్యవహరిస్తోంది. పీఎంసీ బ్యాంక్ ఉదంతం నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉంటూ వస్తోంది. అందుకే ఆర్బీఐ ఇప్పుడు మరో బ్యాంక్పై కూడా కన్నేసి ఉంచింది.
Samayam Telugu14 Jan 2020, 6:18 am
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలో బ్యాంకులపై పూర్తి నిఘా పెట్టినట్లు ఉంది. ఆర్థిక అంశాలకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగకుండా ముందు నుంచే అప్రమత్తతో వ్యవహరిస్తోంది. పీఎంసీ బ్యాంక్ ఉదంతం నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉంటూ వస్తోంది. అందుకే ఆర్బీఐ ఇప్పుడు మరో బ్యాంక్పై కూడా కన్నేసి ఉంచింది.
ఆ బ్యాంక్పై ఆంక్షలు
ఆర్బీఐ కర్నాటకలోని బెంగళూరులో ఉన్న శ్రీ గురురాఘవేంద్ర సహకార బ్యాంక్పై ఆంక్షలు విధించింది. కార్యకలాపాలు నిర్వహించవద్దని ఆదేశించింది. రుణాలు ఇవ్వకూడదని, అలాగే వాటిని రెన్యూవల్ కూడా చేయొద్దని ఆర్డర్లు జారీ చేసింది. ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దని, రుణాలు తీసుకోవద్దని, డిపాజిట్లు స్వీకరించొద్దని పేర్కొంది.
అంతేకాకుండా బ్యాంక్ ఎలాంటి చెల్లింపులు చేయవద్దని ఆర్బీఐ పేర్కొంది. ఒప్పందాలు కుదుర్చుకోవడం, ప్రాపర్టీ లేదా ఇతర ఆస్తులకు ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే విక్రయించడం వంటివి చేయకూడదని తెలిపింది. అలాగే అప్పులను తగ్గించుకోవడానికి చెల్లింపుకు చేయొద్దని పేర్కొంది.
రిజర్వు బ్యాంక్ ఆంక్షలతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఆర్బీఐ బ్యాంక్ నుంచి రూ.35,000కు మించి డబ్బు విత్డ్రా చేసుకోవద్దని ఆర్డర్లు జారీ చేసింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఇతర డిపాజిట్ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. అంటే ఈ ఖాతాల నుంచి రూ.35 వేలకు పైన డబ్బు తీసుకోవడం కుదరదు.
బ్యాంక్ ఆర్థిక పనితీరు మెరుగుపడేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. జనవరి 10 నుంచి ఆర్బీఐ ఆంక్షలు ఆరు నెలల పాలు అమలులో ఉంటాయి. అవసరం అనుకుంటే ఆర్బీఐ ఈ ఆంక్షలను సమీక్షిస్తూ వస్తుంది. జనవరి 2న కూడా ఆర్బీఐ బ్యాంక్కు ఆంక్షలకు సంబంధించి ఒక లెటర్ రాసింది.
Twitter-I want to assure all depositors of Sri Guru Raghav...
ఆంక్షలు ఇందుకే
గురురాఘవేంద్ర బ్యాంక్ అధికారాలను దుర్వినియోగం చేయడం ఇందుకు ప్రధాన కారణం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏలోని సబ్ సెక్షన్ 1 ప్రకారం ఆర్బీఐ ఈ ఆంక్షలు విధించింది.
బ్యాంక్ డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదని, మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుందని బ్యాంక్ చైర్మన్ కె.రామకృష్ణ హామి ఇచ్చారు. డబ్బులు 100 శాతం సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. మీ డబ్బు మాది పూర్తి బాధ్యత అని డిపాజిటర్లలో విశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు.
బ్యాంక్ డిపాజిటర్లు భయపడాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిస్థితిని గమనిస్తూ ఉన్నారని తెలిపారు. డిపాజిటర్లకు నష్టం కలుగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు.
శ్రీ గురురాఘవేంద్ర సహకార బ్యాంక్ నియమిథ అనేది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. బెంగళూరులో బసవనగుడిలోని ఉన్న నెట్టకలప్ప సర్కిల్లో బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో దీనికి నాలుగు అవార్డు వచ్చాయి. బ్యాంక్ మంచి లాభాల్లోనే ఉంది. బ్యాంక్ 2017-18 ఆర్థిక సంవత్సరం వరకే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అప్పుడు బ్యాంక్ లాభం రూ.28 కోట్లుగా ఉంది. బ్యాంకుకు 9,000కు పైగా డిపాజిటర్లు ఉన్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.