యాప్నగరం

Repo Rate: రుణ గ్రహీతలకు ఝలకిచ్చిన ఆర్‌బీఐ.. డబ్బులు దాచుకునే వారికి పండగే!

EMI: అందరి అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు పెంచేసింది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల బ్యాంక్ కస్టమర్లకు ప్రభావం పడబోతోంది. మరీముఖ్యంగా రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ ఉండొచ్చు. రుణ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ రెపో రేటు పెంపు వల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి మాత్రం ఊరట కలుగుతుంది.

Authored byKhalimastan | Samayam Telugu 5 Aug 2022, 10:55 am

ప్రధానాంశాలు:

  • కీలక నిర్ణయం తీసుకున్న రిజర్వు బ్యాంక్
  • రెపో రేటు పెంచుతున్నట్లు వెల్లడి
  • 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం
  • దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడనుంది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu rbi rate hike
రెపో రేటు పెంచేసిన ఆర్‌బీఐ
Loan: బ్యాంకుల పెద్దన్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ తాజా సమీక్షలో కీలక రెపో రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. దీంతో ఆర్‌‌బీఐ రెపో రేటు 5.4 శాతానికి చేరింది. మే నెల నుంచి చూస్తే రెపో రేటు 1.4 శాతం మేర పెరిగింది. 2019 ఆగస్ట్ నుంచి చూస్తే రెపో రేటు ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి. ఆర్‌బీఐ అదేసమయంలో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) 5.15 శాతానికి, బ్యాంక్ రేటును 5.65 శాతానికి సవరించింది.
అలాగే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ 2022-23 ఆర్థిక సంవత్సరం జీడీపీ రేటు అంచనాలను 7.2 శాతంగా కొనసాగించారు. ఏప్రిల్ జూన్ జీడీపీ పెరుగుదల 16.2 శాతంగా, జూలై సెప్టెంబర్ జీడీపీ గ్రోత్ 6.2 శాతంగా, అక్టోబర్ డిసెంబర్ జీడీపీ రేటు 4.1 శాతంగా, 2023 జనవరి మార్చి జీడీపీ రేటు 4 శాతంగా ఉండొచ్చని వివరించారు. ద్రవ్యోల్బణం కాస్త తగ్గిందని, అయితే ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతోందని శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు. జూలై సెప్టెంబర్‌లో సీపీఐ ద్రవ్యోల్బణం 7.1 శాతంగా, అక్టోబర్ డిసెంబర్ సీపీఐ 6.4 శాతంగా, 2023 జనవరి మార్చి సీపీఐ ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. మొత్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉండొచ్చన్నారు.

Also Read: undefined

ఇండియన్ రూపాయి పతనం గురించి మాట్లాడుతూ.. రూపాయి క్షీణతకు డాలర్ బలపడటం కారణంగా పేర్కొన్నారు. అంతేకానీ భారతదేశ స్థూల ఫండమెంటల్స్‌ పటిష్టంగానే ఉన్నాయన్నారు. రూపాయి స్థిరత్వాన్ని కాపాడుకోవడంపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో వంట నూనె ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కాగా ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచనున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు వరుసపెట్టి రుణ రేట్లు పెంచుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ రుణ రేట్లు పైకి చేరనున్నాయి. దీని వల్ల లోన్ ఈఎంఐలు పెరగొచ్చు. అంతేకాకుండా రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగనుంది. ఎఫ్‌డీలపై, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు పైపైకి చేరనుంది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.