రూ.2,000 నోట్లు బ్యాన్! మార్కెట్లోకి కొత్త రూ.1,000 నోట్లు?
RBI | మోదీ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుందా? పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ మళ్లీ ఇప్పుడు అలాంటి నిర్ణయమే తీసుకున్నారా? రూ.2,000 నోట్లపై నిషేధం విధించారా? కొత్త రూ.1,000 నోట్లు తీసుకువస్తున్నారా?
Samayam Telugu 10 Oct 2019, 5:32 pm
ప్రధానాంశాలు:
- మోదీ సర్కార్ రూ.2,000 నోట్లను రద్దు చేస్తోంది
- వీటి స్థానంలో మళ్లీ రూ.1,000 నోట్లను తీసుకువస్తోంది
- జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి
- సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న న్యూస్
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ షాకిచ్చింది. రూ.2,000 నోట్లపై నిషేధం విధించింది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ప్రజలు వారి వద్ద ఉన్న వారి వద్ద ఉన్న రూ.50,000 వరకు విలువైన రూ.2,000 నోట్లను 10 రోజులకు ఒకసారి బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు. ఆర్బీఐ రూ.2,000 నోట్ల స్థానంలో కొత్తగా మళ్లీ రూ.1,000 నోట్లను చెలామణిలోకి తీసుకువస్తుంది. ఇదంతా నిజమని నమ్మేశారా? అయితే మీరు పప్పులో కాలేశారు. పైన చెప్పిందంతా ఫేక్. ఈ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతోంది. వీటిల్లో ఏమాత్రం నిజం లేదు.
ఆర్బీఐ అధికారికి వెబ్సైట్లో రూ.2,000 నోట్ల నిషేధం, కొత్త రూ.1,000 నోట్ల విడుదల అంశానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. అంటే ఇది ఫేక్ న్యూస్. అలాగే ఆర్బీఐ కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించింది. ‘‘మా వైపు నుంచి రూ.2,000 నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మేం తెలియజేయాలనుకున్న ప్రతి అంశం వెబ్సైట్లో ఉంచుతాం. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్తలు నమ్మవద్దు’’ అని ఆర్బీఐ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సీజీఎం యోగేశ్ దయాల్ వివరణ ఇచ్చారు.
Also Read: undefined
ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దు చేస్తోందని పుకార్లు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఈ అంశం మరోసారి వైరల్ అవుతోంది. కాగా 2016 నవంబర్లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
Also Read: undefined
ఆర్బీఐ అధికారికి వెబ్సైట్లో రూ.2,000 నోట్ల నిషేధం, కొత్త రూ.1,000 నోట్ల విడుదల అంశానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. అంటే ఇది ఫేక్ న్యూస్. అలాగే ఆర్బీఐ కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించింది. ‘‘మా వైపు నుంచి రూ.2,000 నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మేం తెలియజేయాలనుకున్న ప్రతి అంశం వెబ్సైట్లో ఉంచుతాం. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్తలు నమ్మవద్దు’’ అని ఆర్బీఐ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సీజీఎం యోగేశ్ దయాల్ వివరణ ఇచ్చారు.
Also Read: undefined
ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దు చేస్తోందని పుకార్లు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఈ అంశం మరోసారి వైరల్ అవుతోంది. కాగా 2016 నవంబర్లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
Also Read: undefined