యాప్నగరం

Ratail Inflation Surge: కొండెక్కిన ద్రవ్యోల్బణం.. మళ్లీ ధరల మోత.. వడ్డీ రేట్ల సంగతేంటి.. ఇక కష్టమేనా?

Ratail Inflation Surge: రిటైల్ ద్రవ్యోల్బణం మరోసారి భారీగా పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం జనవరి నెలలో మళ్లీ 3 నెలల గరిష్టానికి చేరింది. అయితే.. ఎంత శాతం పెరిగింది.. పెరిగితే ఏమవుతుంది? తెలుసుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 13 Feb 2023, 8:52 pm
Ratail Inflation Surge: మళ్లీ నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం రెక్కలు చాస్తోంది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం మళ్లీ 3 నెలల గరిష్టాన్ని తాకింది. జనవరిలో‌ ఏకంగా 6.52 శాతానికి చేరినట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అంటే గతేడాది డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో ఇది 5.88 శాతం వద్ద ఉంది. ఇక 2022 అక్టోబర్‌లో 6.77 శాతంగా ఉంది. రెండు నెలలు భారీగా పడిపోయిన ద్రవ్యోల్బణం మళ్లీ ఈసారి 6 శాతానికి ఎగువకు చేరింది.
Samayam Telugu retail inflation


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ద్రవ్యోల్బణం లక్షిత పరిధిని 6 శాతం వరకు ఉంచింది. అంటే.. 4 నుంచి 6 శాతంగా నమోదు కావాలని అంచనా వేసింది. నవంబర్, డిసెంబర్‌లో దీనిని చేరుకున్నప్పటికీ.. మళ్లీ 2023 ఏడాది తొలి నెలలో తిరిగి అదే లక్షిత పరిధిని దాటింది. దీంతో మరోసారి ధరల తిప్పలు తప్పేలా లేవు.

Federal Bank:సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు పెంపు.. బ్యాంక్‌ ఖాతాలో డబ్బులుంటే అధిక వడ్డీ.. పండగే!
ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర కేంద్ర బ్యాంకులు.. వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వల్పంగా 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. ద్రవ్యోల్బణం నవంబర్, డిసెంబర్‌లో స్వల్పంగా నమోదైన నేపథ్యంలోనే రెపో రేటును స్వల్పంగా పెంచింది. కానీ.. ఇప్పుడు మళ్లీ లక్షిత పరిధిని దాటింది గనుక మరోసారి వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశాలు ఉంటాయి.

గతేడాది మే నెల నుంచి వరుసగా రెపో రేటును పెంచుకుంటూ పోతోంది ఆర్‌బీఐ. మార్చిలో 4 శాతం వద్ద ఉన్న రెపో రేటు.. ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది. అంటే.. సంవత్సరం గడవక ముందే.. 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం మేర రెపో రేటును పెంచడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగానూ ఇదే అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దానిని కట్టడి చేసేందుకు.. వడ్డీ రేట్ల పెంపునే ప్రధాన అస్త్రంగా చేసుకున్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొంటున్నాయి. ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ బ్యాంకులు ఇదే బాటలో పయనించాయి.

Adani Hindenburg Row: అదానీ వ్యవహారంలో సరికొత్త మలుపు.. సుప్రీం సీరియస్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Read Latest Business News and Telugu News
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.