యాప్నగరం

Price Hike: ధరల బాదుడు.. 5 రోజుల్లో భారీగా పెరిగిన వీటి రేట్లు!

Rice Import Duty Cut: ధరలు మళ్లీ పెరిగాయి. ఇప్పుడు బియ్యం వంతు వచ్చింది. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో పెంపు ఏకంగా 20 శాతంగా ఉంది. దేశీ మార్కెట్‌లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్‌లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. బియ్యం ధరలు బాగా పెరిగాయి. దీంతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం దెబ్బకు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Authored byKhalimastan | Samayam Telugu 28 Jun 2022, 6:45 pm

ప్రధానాంశాలు:

  • దేశంలో పెరుగుతూనే వస్తున్న ధరలు
  • ఒకదాని తర్వాత మరొకటి దాని రేటు జంప్
  • దీంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం
  • ఇప్పటికే చాలా వాటి ధరలు పైపైకి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu price hike
ధరల బాదుడు
Import Duty: ధరల పెరుగుదల కొనసాగుతూనే వస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి.. ఇలా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుుడు తాజాగా బియ్యం ధరలు కొండెక్కాయి. దేశీ మార్కెట్‌లోనూ. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బియ్యం ధరలు పరుగులు పెడుతున్నాయి. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే బియ్యం ధర 10 శాతం వరకు పైకి కదిలింది. బంగ్లాదేశ్ దిగుమతి సుంకాలను తగ్గించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ టారిఫ్ ధరలను 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గించేసింది. దీంతో పొరుగున మనం భారత్‌ నుంచి ఎగుమతులు పెరగనున్నాయి.
నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులకు సంబంధించి బంగ్లాదేశ్ సుంకాలను తగ్గించింది. అక్టోబర్ 31 వరకు ఈ తగ్గింపు నిర్ణయం అమలులో ఉంటుంది. భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తుందనే భయాలతో బంగ్లాదేశ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముందుగానే ఎక్కువగా బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. సాధారణంగా బంగ్లాదేశ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు గోధుమల సరఫరా తగ్గింది. అలాగే దేశంలో వరదల కారణంగా వరి పంట దెబ్బతింది. దీంతో కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే బంగ్లాదేశ్ ముందుగానే దిగుమతి చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

గ్లోబల్ మార్కెట్‌లో గత ఐదు రోజుల్లో ఇండియన్ నాన్ బాస్మతి బియ్యం ధర టన్నుకు 350 డాలర్ల నుంచి 360 డాలర్లకు చేరింది. బంగ్లాదేశ్ దిగుమతి సుంకాలను తగ్గించడం ఇందుకు ప్రధాన కారణమని రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీవీ కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే బియ్యం ధరలు 10 శాతం పెరిగాయని, ఇంకా పెరిగే అవకాశం ఉందని తిరుపతి అగ్రి ట్రేడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూరజ్ అగర్వాల్ తెలిపారు. బంగ్లాదేశ్ సాధారణంగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి బియ్యం ఎక్కువగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల్లో బియ్యం దరలు 20 శాతం మేర పైకి చేరాయని వివరించారు. బంగ్లాదేశ్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 13.59 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంది. కాగా చైనా తర్వాత ఇండియానే ప్రపంచంలో ఎక్కువగా బియ్యాన్ని వినియోగిస్తున్న దేశంగా కొనసాగుతోంది. గ్లోబల్ రైస్ ట్రేడ్‌లో భారత్ మార్కెట్ వాటా 40 శాతానికి పైగా ఉంది.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.