యాప్నగరం

2000 నోటుపై RBI కీలక ప్రకటన.. సామాన్యులకే ఇబ్బందా? అందరిలో ఒకటే టెన్షన్!

Rs 2000 Notes: Rs 2000 Notes: ఆర్థిక వ్యవస్థ నుంచి 2000 నోట్ల రూపాయలను ఉపసంహరించుకుంటున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కసారిగా ఈ ప్రకటనతో పలువురిలో భయాందోళనలు నెలకొన్నాయి. మరి ఈ నిర్ణయం.. సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందా?

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 6 Jun 2023, 10:26 am
Rs 2000 Notes: రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం రోజు పెద్ద నోట్లపై కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ ఆకస్మిక ప్రకటనతో చాలా మందిలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. నోట్లను మార్చుకోవడం ఎలా.. ఎంత వరకు లిమిట్ ఉంటుంది.. ఇలా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అయినప్పటికీ ఈ నోట్ల ఉపసంహరణపై RBI ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మరో నాలుగు నెలల సమయం ఉందని.. అప్పటివరకు రూ. 2 వేల నోటును మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడం చేయొచ్చని స్పష్టం చేసింది. దీంతో.. రిజర్వ్ బ్యాంక్ ప్రకటన సామాన్యులను పెద్దగా ఆందోళనకు గురి చేయడం లేదు. ఇప్పటికే ఈ రూ. 2 వేల నోట్ల చలామణీ దాదాపుగా నిలిచిపోయింది. బ్యాంకులకు వెళ్లిన నోట్లు అటే పోతున్నాయి. తిరిగి రావట్లేదు.
Samayam Telugu RS 2000 NOTE


ఏటీఎంల నుంచి కూడా దాదాపుగా రూ.2 వేల నోట్లు ఎప్పటినుంచో రావడం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఈ పెద్ద నోట్లను ముద్రించడం కూడా నాలుగైదేళ్ల కిందటే నిలిపివేసినట్లు స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు చలామణీలో ఉన్న వాటి లైఫ్‌టైం కూడా ముగియడానికి వచ్చిందని చెప్పింది. సాధారణ జనం దగ్గర కూడా రూ.500, అంతకంటే తక్కువ విలువైన నోట్లే ఉంటున్నాయి. ఈ కారణంతో ఈ పెద్ద నోట్ల ఉపసంహరణ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది.

శుభవార్త.. భారీగా పతనమవుతున్న బంగారం ధర.. లేటెస్ట్ రేట్లు ఇవే.. తులం ఎంతంటే?

అప్పటి పరిస్థితులు వేరు..

చివరగా 2016 నవంబర్‌లో అప్పటి రూ.500, రూ. 1000 వంటి పెద్ద నోట్లను రద్దు చేసింది భారత ప్రభుత్వం. అయితే అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు రూ.500, రూ. 1000 నోట్లు బ్యాన్ చేస్తున్నామని, త్వరగా మార్చుకోవాలని ప్రకటించింది. ఇక గడువు తర్వాత ఆ నోట్లు చెల్లవని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన కలిగింది. అప్పట్లో జనం బ్యాంకుల ముందు కుప్పలుతెప్పలుగా గుమికూడారు.

ఇక అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కరెన్సీ సర్క్యులేషన్ కోసం.. రూ. 2 వేల నోటును తీసుకొచ్చింది. తర్వాత క్రమక్రమంగా దీని ముద్రణ తగ్గించుకుంటూ వచ్చింది. అప్పట్లో ముద్రించిన వాటిల్లో దాదాపు 89 శాతం వరకు క్షీణించాయి. RBI స్టాటిస్టిక్స్ చూస్తే.. ఈ సంవత్సరం మార్చి వరకు వ్యవస్థలో చలామణీలో ఉన్న నగదు రూ.31.33 లక్షల కోట్లు. ఇందులో రూ.2 వేల నోట్ల వాటా రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఇది మొత్తంలో 10 శాతం వరకే ఉంది. వీటిల్లో చాలా వరకు బ్యాంకుల్లోనే ఉంది.



రూ. 2 వేల నోట్లు ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చా? ఎప్పటివరకు వాడుకోవచ్చు? ఫుల్ డీటెయిల్స్ ఇక్కడే..
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.