యాప్నగరం

Fake Documents For Sim Card: సిమ్ కార్డు ఇలా కొంటే.. రూ.50 వేల జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష, హెచ్చరించిన కేంద్రం!

Fake Documents For Sim Card: సిమ్ కార్డులు కొనేటప్పుడు కొందరు నకిలీ డాక్యుమెంట్లను సమర్పిస్తున్నారు. ఇలా నకిలీ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులను పొందుతూ... ప్రజలను మోసగిస్తున్నారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై తమ గుర్తింపును తప్పుగా చూపించుకుని, ప్రజలను ఆగం చేస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త టెలికాం బిల్లును ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ బిల్లు డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్‌ బిల్లులో కఠినతరమైన నిబంధనలను పొందుపరిచింది. భారీ జరిమానాలను, జైలు శిక్షలను అమల్లోకి తేబోతుంది.

Authored byKoteru Sravani | Samayam Telugu 29 Sep 2022, 10:26 am

ప్రధానాంశాలు:

  • నకిలీ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు, ఓటీటీ సర్వీసులు
  • కొరడా ఝళిపించబోతున్న కేంద్రం
  • కొత్త టెలికాం బిల్లు డ్రాఫ్ట్‌ను విడుదల చేసిన డాట్
  • డ్రాఫ్ట్ బిల్లులో కఠినతరమైన నిబంధనలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Telecom Draft Bill for SIM Cards
సిమ్ కార్డులకు టెలికాం డ్రాఫ్ట్ బిల్లు
Fake Documents For Sim Card: తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి కొత్త సిమ్ కార్డులు(SIM Cards) తీసుకుంటున్నారా? అయితే మీకో హెచ్చరిక. సిమ్ కార్డు పొందేందుకు నకిలీ డాక్యుమెంట్లను సమర్పిస్తే.. రూ.50 వేల జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష పడనుంది. అంతేకాక వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్ ది టాప్(OTT) ప్లాట్‌ఫామ్‌లలో మీ గుర్తింపును మానిపులేట్ చేసినా కూడా మీరు జైలు పాలు కావాల్సిందే. కొత్తగా అమల్లోకి తేవాలనుకుంటోన్న ఇండియా టెలికమ్యూనికేషన్ బిల్లు, 2022 డ్రాఫ్ట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించినట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది.
అక్రమ కార్యకలాపాలు, ఆన్‌లైన్ మోసాల నుంచి టెలికాం యూజర్లను కాపాడేందుకు డ్రాఫ్ట్ బిల్లులో ఈ ప్రతిపాదనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. సిమ్ కార్డులు పొందేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ డాక్యుమెంట్లను సమర్పిస్తున్నారు. ఆ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులను పొంది ప్రజలను మోసం చేస్తున్నారు. అంతేకాక ఓటీటీ యాప్స్‌పై తమ గుర్తింపును కూడా దుర్వినియోగపరుస్తూ ప్రజలను వేధిస్తున్నారు. ఈ నేరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను కొత్తగా అమల్లోకి తేబోతున్న డ్రాఫ్ట్ బిల్లు(Telecom Draft Bill)లో పొందుపరిచింది.

ఈ ప్రతిపాదిత టెలికాం బిల్లును ప్రస్తుతం ఇండస్ట్రీ వాటాదారుల, ప్రజల అభిప్రాయ సేకరణ కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం(డాట్). పైన పేర్కొన్న ప్రతిపాదనల ద్వారా టెలికాం సర్వీసుల ద్వారా జరిగే సైబర్ మోసాలను అరికట్టవచ్చని డాట్ పేర్కొంటోంది. ఈ డ్రాఫ్ట్ బిల్లులోని సెక్షన్ 4 కిందనున్న సబ్ సెక్షన్ 7లో ఐడెంటీని తప్పుగా పేర్కొనడం ద్వారా ఏమైనా అక్రమ లావాదేవీలకు పాల్పడితే ఏడాది పాటు జైలు శిక్ష, రూ.50 వేల పెనాల్టీ(Penalty) పడనుంది. అంతేకాక టెలికాం సర్వీసులను కూడా వారికి రద్దు చేస్తారు. వీటిని తీవ్రమైన నేరంగా పరిగణించి.. ఎలాంటి వారెంట్ లేదా ముందస్తు కోర్టు అనుమతి లేకుండానే పోలీసులు ఆ కార్యకలాపాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

Also Read : ఎయిర్‌టెల్ కొత్త సేవలు.. బ్యాంకు కస్టమర్లందరికీ శుభవార్త!

కొత్త టెలికాం బిల్లు సైబర్ మోసాల(Cyber Crimes)ను నిరోధించనుందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఓటీటీలకు నో యువర్ కస్టమర్(KYC) కంప్లియెన్స్‌ను తప్పనిసరి చేయడం ద్వారా ఈ మోసాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. పలు ప్లాట్‌ఫామ్‌లపై ఎవరు కాల్ చేస్తున్నారో రిసీవర్ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈ కారణంతోనే ఓటీటీలను కూడా కలుపుకుని అన్ని ప్లాట్‌ఫామ్‌లను ఈ కొత్త బిల్లులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. కాల్ రిసీవ్ చేసుకునే సమయంలో స్క్రీన్‌పై కాల్ చేసే వ్యక్తి పేరు కనిపించే మెకానిజాన్ని తీసుకురావాలని రెగ్యులేటరీ టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియాను డాట్ ఆదేశించింది. ఈ పేరు కేవైసీ డాక్యుమెంట్లలో సమర్పించినది ఉండాలని తెలిపింది.

Also Read : 7 నెలల కనిష్టానికి గోల్డ్ ఫ్యూచర్స్.. హైదరాబాద్‌లో తులం బంగారమెంత?

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.