యాప్నగరం

గెలాక్సీ నోట్ 7కి బదులు వేరొక స్మార్ట్‌ఫోన్

భారత్‌లో ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసుకున్నవారికి దాని స్థానంలో వేరొక మొబైల్‌ను అందజేస్తామని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది.

TNN 15 Oct 2016, 2:25 pm
భారత్‌లో ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేసుకున్నవారికి దాని స్థానంలో వేరొక మొబైల్‌ను అందజేస్తామని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. నోట్ 7 కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్నవారు తమ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చని వెల్లడించింది. ఫోన్‌తో పాటు వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, క్యాష్ వోచర్, స్క్రీన్ పగిలిపోతే ఒకసారి ఉచితంగా రీప్లేస్ చేసుకునే సదుపాయాలను కల్పిస్తోంది.
Samayam Telugu samsung india announces freebies for note 7 users
గెలాక్సీ నోట్ 7కి బదులు వేరొక స్మార్ట్‌ఫోన్

ప్రపంచంలో అతిపెద్ద ఫోన్ తయారీదారు అయిన సామ్‌సంగ్.. గెలాక్సీ నోట్ 7ను విడుదల చేసినప్పటి నుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ ఫోన్ బాగా వేడెక్కడంతోపాటు బ్యాటరీ పేలిపోతుందని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో మొదట ఫోన్లను వెనక్కు రప్పించి ఈ సమస్యపై పరిశోధన చేసింది. అయినప్పటికీ ఫిర్యాదులు ఆగకపోవడంతో చివరకు ప్రపంచవ్యాప్తంగా గెలాక్సీ నోట్ 7 విక్రయాలను ఆపేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా వాటి తయారీని కూడా నిలిపివేసింది. అయితే ఇప్పటికీ భారత్‌లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నవారు తమ కంపెనీకి చెందిన వేరొక స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.