యాప్నగరం

Money Changes: మే నెలలో వచ్చిన 5 'మనీ' మార్పులు ఇవే.. మీ జేబుకు చిల్లు పడొచ్చు!

Money Changes: కొత్త ఆర్థిక ఏడాది మొదలై రెండో నెలలోకి అడుగుపెట్టాం. పన్ను చెల్లింపుదారులకు ఈ మే నెల ఎంతో కీలకం. అలాగే సామాన్యులను సైతం ప్రభావితం చేసే పలు కీలక మార్పులు ఈ మే నెలలో చోటు చేసుకున్నాయి. డబ్బుకు సంబంధించిన 5 కీలక మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయా మార్పులతో మీ జేబుకు చిల్లు పడే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ మేలో జరిగిన ఈ మార్పుల గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 3 May 2023, 1:05 pm
Money Changes: కొత్త నెల ప్రారంభం కాగానే సాధారణంగా చాలా మార్పులు, కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. వ్యక్తిగతంగా డబ్బులకు సంబంధించిన కీలక మార్పుల గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాంటి కొన్ని మార్పులు ఈ మే నెలలోనూ జరిగాయి. మే, 2023 నుంచి అమలులోకి వచ్చిన ఈ మార్పులు నేరుగా మా ఆర్థిక అంశాలపై ప్రభావం చూపవచ్చు. అందుకే వీటి గురించి తెలుసుకుని ముందుగు సాగడం మంచిది. అలాంటి 5 ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం ఛార్జీలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిడ్ కార్డు ఛార్జీలు, ఇతర అంశాల్లో మార్పులు, అధిక పెన్షన్ ఈపీఎస్ డెడ్‌లైన్‌లో మార్పులు, కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు ఛార్జులు, మ్యూచువల్ ఫండ్ ఇ-వాలెట్ కేవైసీ వంటివి ఉన్నాయి. ఏటీఎం, డెబిట్ కార్డు ఛార్జుల్లో సైతం మార్పులు ఉన్న కారణంగా సామాన్యులకు వీటితో సంబంధం ఉంటుంది. అందే జేబుకు చిల్లు పడకుండా వాటిని వినియోగించుకోవాలంటే ఈ మార్పుల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Samayam Telugu sbi credit card to mutual fund five money changes in may 2023 that you should know
Money Changes: మే నెలలో వచ్చిన 5 'మనీ' మార్పులు ఇవే.. మీ జేబుకు చిల్లు పడొచ్చు!


ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు (SBI Credit Card)

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం AURUM కార్డు ఉన్న వారు రూ.5 లక్షల లిమిట్ దాటిన తర్వాత అందే రూ.5000 విలువైన ఆర్‌బీఎల్ లక్సే కూపన్ ఇకపై అందుకోరు. దాని స్థానంలో టాటా క్లిక్ లగ్జరీ వోచర్ వస్తుంది. ఇది మే 1, 2023 నుంచే అమలులోకి వచ్చింది. అలాగే ఈజీడైన్ ప్రైమ్, లెన్స్‌కార్ట్ గోల్డ్ మెంబర్‌షిప్ సైతం ఇకపై అందుబాటులో ఉండదు. దీంతో పాటు సింప్లీ క్లిక్ ఎస్‌‌బీఐ కార్డ్, సింప్లీ క్లిక్ అడ్వాంటేడ్ ద్వారా ఆన్‌లైన్ రెంట్ పేమెంట్ చేస్తే ఇకపై 5 రివార్డ్ పాయింట్లకు బదులు ఒకే రివార్డ్ పాయింట్ వస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీలు (debit card charges)

దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మే 22, 2023 నుంచి పెంచుతున్న ఛార్జీలు అమలులోకి వస్తాయని తమ కస్టమర్లకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఎంపిక చేసిన కస్టమర్లకు పంపిన ఇ-మెయిల్ ప్రకారం చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ డెబిట్ కార్డు వార్షిక చార్జీలు రూ.199 ప్లస్ జీఎస్‌టీ నుంచి రూ.259 ప్లస్ జీఎస్‌టీ మారుస్తున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.

పీఎన్‌బీ ఏటీఎం ఛార్జీలు (PNB ATM charges)

పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ మే నెలలో ఏటీఎం ఛార్జీలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. అకౌంట్లో సరిపడ నగదు లేకుండా ఏటీఎం క్యాష్ విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్లయితే రూ.10 ఛార్జీలు వసూలు చేయనుంది. దానిపై జీఎస్‌టీ అదనం. ఈ మార్పులు మే 1, 2023 నుంచే అమలులోకి వస్తాయని పీఎన్‌బీ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. అలాగే డెబిడ్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల జారీలో ఫీజుల మార్పు చేసే ప్రణాళికలో ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. దీంతో పాటు ఖాతాలో డబ్బులు లేకుండా పీఓఎస్, ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్లు చేసి ఫెయిల్ అయితే సైతం ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది.

మ్యూచువల్ ఫండ్ ఇ-వాలెట్ కేవైసీ (Mutual Fund e wallet kyc)

సెక్యూరిటీ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రాకారం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇ-వాలెట్స్ ఉపయోగించినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇ-కేవైసీ గైడ్ లైన్స్‌ పాటించాలి. మే 1, 2023 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. గతంలో విడుదల చేసిన సెబీ సర్క్యూలర్ ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్ కోసం ఇ-వాలెట్స్ ఉపయోగించడం రూ.50,000 వరకు మాత్రమే పరిమితి ఉంటుంది. ఒక ఇన్వస్టర్ ఇ-వాలెట్ ద్వారా రూ.50 వేల వరకు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి ఉంటుంది. ఈ క్రమంలో మార్చి 23, 2023 నాటి సర్క్యూలర్ ప్రకారం, అన్ని ఇ-వాలెట్స్ తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

అధిక పెన్షన్ దరకాస్తు (Higher EPS pension)

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) ద్వారా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు గడువును పెంచింది ఈపీఎఫ్ఓ. జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. అయితే, ఇది మే 3 వరకే చివరి తేదీ ఉండేది. బుధవారమే ఈ గడువును పొడిగించారు. అర్హత కలిగిన వారు జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఇది వరకే ఓసారి గడువు పొడిగించిన క్రమంలో ఈసారి పెంచే అవకాశం లేదని అంతా భావించారు. కానీ మరో రెండు నెలలు గడువు ఇవ్వడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.