యాప్నగరం

రేపటి నుంచి SBI కొత్త రూల్స్.. కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలివే!

స్టేట్ బ్యాంక్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో చెక్ ద్వారా నిర్వహించే లావాదేవీలు మరింత సురక్షితగా మారతాయి. అయితే ఈ సేవలు పొందాలా? వద్దా? అనేది కస్టమర్ల ఇష్టం.

Samayam Telugu 31 Dec 2020, 6:58 am

ప్రధానాంశాలు:

  • కొత్త రూల్స్ తీసుకువస్తున్న ఎస్‌బీఐ
  • రేపటి నుంచి అమలులోకి
  • చెక్ లావాదేవీలు మరింత భద్రం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi new rules
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కొత్త రూల్స్ తీసుకువస్తోంది. జనవరి 1 నుంచి పాజిటివ్ పే సిస్టమ్‌ను అమలు చేయలని నిర్ణయం తీసుకుంది. చెక్‌లకు సంబంధించి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. చెక్కుల ద్వారా నిర్వహించే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు స్టేట్ బ్యాంక్ ఈ విధానాన్ని తీసుకువస్తోంది.
కొత్త సిస్టమ్ ప్రకారం.. కస్టమర్లు రూ.50,000కు పైన నిర్వహించే లావాదేవీలను అదనపు సమాచారం అందించాల్సి ఉంటుంది. చెక్కులు జారీ చేసే వారు అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ అమౌంట్, చెక్ డేట్, చెక్ పేయీ వంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

Also Read: undefined


Also Read: undefined

ఆర్‌బీఐ నిబంధనల మేరకు పాజిటివ్ పే సిస్టమ్ PPS అమలులోకి తీసుకువస్తున్నామని స్టేట్ బ్యాంక్ తెలిపింది. జనవని 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుందని పేర్కొంది. చెక్కులు జారీ చేసే వారు అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ అమౌంట్, చెక్ డేట్, పేయీ పేరు వంటి వివరాలు తెలియజేయాల్సి ఉందని వివరించింది. ఈ వివరాలను ట్వీట్ కూడా చేసింది.

అయితే బ్యాంక్ అందిస్తున్న పాజిటివ్ పే సిస్టమ్ సర్వీసులు ఉపయోగించుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా కస్టమర్లదే అని స్టేట్ బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే బ్యాంకులు రూ.5 లక్షలు లేదా ఆపైన చెక్ లావాదేవీలకు ఈ విధానాన్ని తప్పనిసరి చేయొచ్చు. కొత్త విధానంలో చెక్కులు జారీ చేసే వారు చెక్ వివరాలను బ్యాంక్‌కు మళ్లీ అందించాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి వాటి ద్వారా వివరాలు అందించొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.