యాప్నగరం

SBI Interest Rates : ఇంటి రుణాలు తీసుకునే వారికి గమనిక.. ఈ రేట్లు కూడా పెంపు!

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటును పెంచిన తర్వాత అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. మార్జినల్ కాస్ట్ ఆధారిత వడ్డీ రేటును, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్లను, రెపో లింక్డ్ రేట్లను పెంచుతూ కస్టమర్లకు షాకిస్తున్నాయి. తాజాగా ఎస్‌బీఐ హోమ్ లోన్ల ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేటును పెంచినట్టు ప్రకటించింది. దీంతో ఇక నుంచి ఎంసీఎల్ఆర్ అనుసంధాన లోన్లు మాత్రమే కాదు, వీటి రుణాల వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి.

Authored byKoteru Sravani | Samayam Telugu 23 May 2022, 12:35 pm

ప్రధానాంశాలు:

  • ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు పెంచిన ఎస్‌బీఐ
  • 50 బేసిస్ పాయింట్లు పెంచి, 7.5 శాతానికి ఈ వడ్డీ రేటు
  • రెపో లింక్డ్ లెండింగ్ రేటు కూడా పెంపు
  • పెంచిన వడ్డీ రేట్లు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu SBI Interest Rates
SBI Interest Rates : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) హోమ్ లోన్లపై తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్)ను పెంచింది. ఈ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.5 శాతానికి చేర్చినట్టు State Bank of India ప్రకటించింది. ఆర్ఎల్ఎల్ఆర్ అనేది 6.65 శాతం ప్లస్ సీఆర్‌పీగా ఉండనుందని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ కొత్త వడ్డీ రేట్లు జూన్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంతకుముందు ఈబీఎల్ఆర్ 6.65 శాతంగా.. రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఈ రేట్లు మరింత పెరిగాయి.
SBI website ప్రకారం.. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారితంగా నిర్ణయించే వడ్డీ రేటులో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్(ఈబీఆర్) ప్లస్ క్రెడిట్ రిస్క్ ప్రీమియం(సీఆర్‌పీ) కలిసి ఉంటాయి. బ్యాంకు ఏదైనా లోన్‌ను అంటే ఇంటి రుణాన్ని, వాహన రుణాన్ని ఆఫర్ చేసేటప్పుడు.. బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్‌ఎల్ఎల్ఆర్‌కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం(సీఆర్‌పీ)ని కలుపుతాయి.

Also Read : Post office : ఈ స్కీమ్స్‌లో 7 శాతానికి పైగా వడ్డీ, మీ సేవింగ్స్‌కు లాభాలు పక్కా!

జనవరి 2019 నుంచే ఎస్‌బీఐ రెపో రేటుకి అనుసంధానమైన ఈబీఎల్ఆర్‌ను వాడుతోంది. అప్పటి నుంచి ఈబీఎల్ఆర్ స్థిరంగా ఉంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బెంచ్ మార్క్ వడ్డీ రేటుకి అనుగుణంగా ఈ రేటులో మార్పులుండేవి.

గత వారంలోనే ఎస్‌బీఐ తన మార్జినల్ ఖర్చు ఆధారిత లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు మే 15, 2022 నుంచే అమల్లోకి తెచ్చింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ఓవర్‌నైట్, నెల వ్యవధి, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెరిగి.. ఈ రేట్లు 6.85 శాతానికి, 6.85 శాతానికి, 6.85 శాతానికి, 7.15 శాతానికి చేరుకున్నాయి. అదేవిధంగా ఏడాది కాలానికి గల రుణాల ఎంసీఎల్ఆర్ 7.20 శాతానికి, రెండేళ్ల రుణాల ఎంసీఎల్ఆర్ 7.40 శాతానికి, మూడేళ్ల వ్యవధి గల ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరిగింది.

Also Read : PM Kisan eKYC : రైతులకు అలర్ట్, డబ్బులు పొందాలంటే ఇంకా 8 రోజులే సమయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.