యాప్నగరం

మినిమం బ్యాలెన్స్ వాత.. ఊరటనివ్వనున్న ఎస్‌బీఐ

మినిమం బ్యాలెన్స్ పేరిట ఛార్జీలు వసూలు చేస్తున్న ఎస్‌బీఐ కస్టమర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం.

TNN 5 Jan 2018, 11:47 am
బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ వాతలతో బెంబెలెత్తిపోతున్న సేవింగ్స్ ఖాతాదారులకు శుభవార్త. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీస నగదు నిల్వల మొత్తాన్ని రూ. 1000కి తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం నగరాల్లో ఇది రూ. 3 వేలు ఉండగా.. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1000గా ఉంది. అకౌంట్లో కనీసం రూ. 5 వేలు బ్యాలెన్స్ ఉంచుకోవాలని ఎస్‌బీఐ గత జూన్లో స్పష్టం చేసింది. కానీ ఖాతాదారుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో నిబంధనను సడలించింది.
Samayam Telugu sbi may cut minimum balance requirement for savings accounts
మినిమం బ్యాలెన్స్ వాత.. ఊరటనివ్వనున్న ఎస్‌బీఐ


ప్రస్తుతం నెలవారీగా సగటున కనీస బ్యాలెన్స్‌ ఉండాలని చెబుతున్న ఎస్‌బీఐ దాన్ని త్రైమాసికానికి మార్చనుంది. గత ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య ఎస్‌బీఐ మినిమం బ్యాలెన్స్ ఛార్జీల రూపంలో రూ.1,771 కోట్లు వసూలు చేసింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఎస్‌బీఐకి వచ్చిన నికర లాభం కంటే ఛార్జీల బాదుడే ఎక్కువ కావడం గమనార్హం.

మినిమం ఛార్జీల తగ్గింపు విషయంలో ఎస్‌బీఐ ఇప్పటికీ తుది నిర్ణయానికి రాలేదు. కానీ మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. స్టేట్ బ్యాంక్‌లో కనీస బ్యాలెన్స్ పరిమితి ఎక్కువగా ఉంది. మినిమం బ్యాలెన్స్ పరిధి నుంచి పెన్షనర్లు, సామాజిక ప్రయోజనాలను పొందే లబ్ధిదారులను గతంలోనే ఎస్‌బీఐ మినహాయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.