యాప్నగరం

త్వరగా అలా చేయకపోతే Pan Card పనిచేయదు.. తీవ్ర చర్యలు తప్పవు.. SEBI హెచ్చరిక

PAN Card SEBI: పాన్ కార్డు, ఆధార్ కార్డు భారతీయులకు అత్యంత ముఖ్యం అనే విషయం తెలిసిందే. ఇవి గుర్తింపు కార్డులుగా, ఇతర లావాదేవీలకు కూడా కీలక డాక్యుమెంట్లుగా ఉపయోగపడతాయి. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఈ నేపథ్యంలో సెబీ.. దీని గురించి కీలక ప్రకటన చేసింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 10 Mar 2023, 7:36 pm
PAN Card SEBI: 2023, మార్చి 31 కల్లా పాన్ కార్డు ఉన్న వారు.. దానిని కచ్చితంగా ఆధార్ ‌కార్డుతో అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ). ఇక ఇలా చేయకపోతే.. పాన్ కార్డు పనిచేయదని, ఇన్‌కంటాక్స్ యాక్ట్ 1961 కింద అలాంటి వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొంది. ఇక ఇన్వెస్టర్లంతా ఈ పనిని మార్చి చివరి కల్లా పూర్తి చేయాలని చెప్పిందీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ. ఇక ఇలా చేస్తేనే Stock Market లో ఎలాంటి ట్రాన్సాక్షన్లు అయినా.. ఎలాంటి అవాంతరాలు లేకుండా చేసుకోవచ్చని వెల్లడించింది. ఇక స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయాలనుకుంటే.. ఆధార్, పాన్ కార్డు అనేవి తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెబీ ఇప్పుడు ఒక సర్క్యులర్ జారీ చేసింది.
Samayam Telugu pan aadhaar link


గత సంవత్సరం సీబీడీటీ (సెంట్రల్ డైరెక్ట్ టాక్సెస్ బోర్డ్) ఇష్యూ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2023, మారచి 31 కల్లా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. లేనిచో పాన్ కార్డు పనిచేయదు. వారిపై చర్యలు ఉంటాయి. ''స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు సంబంధించి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందు.. మదుపరులు అంతా పాన్‌కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి. లేనిచో పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. అలాగే ఆ ఇన్వెస్టర్లను నాన్- KYC పూర్తి చేయని వారిగా భావించి.. వారి వారి ట్రాన్సాక్షన్లపై పరిమితులు విధిస్తాం.'' అని SEBI ఒక ప్రకటనలో తెలిపింది.

పాన్ కార్డ్ అప్‌డేట్ చేయకుంటే Bank Account క్లోజ్.. కస్టమర్లకు ఆ బ్యాంక్ హెచ్చరిక! Dhoni, Sachin, ఆలియా భట్ పేర్లతో హైటెక్ మోసం.. అంతా పాన్ కార్డు చుట్టూరానే.. ఇలా కాపాడుకోండి?

అసలు గడువు ఎప్పుడో ముగిసినా.. ఆలస్య రుసుముతో ఈ మార్చి 31 వరకు ఆదాయపు పన్ను శాఖ గడువు విధించింది. ఇప్పుడు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలటే రూ. 1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.