యాప్నగరం

స్టాక్ మార్కెట్ల దూకుడు.. 35 వేల పైన సెన్సెక్స్

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో డబుల్ హండ్రెడ్ పాయింట్లు జంప్ చేసింది.

TNN 30 Apr 2018, 5:06 pm
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో డబుల్ హండ్రెడ్ పాయింట్లు జంప్ చేసింది. మార్కెట్లు ముగిసే సమయానికి 191 పాయింట్లు లాభపడి 35,160 వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంలో 10,739 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో మార్పులు స్టాక్ మార్కెట్ల లాభాలపై ప్రభావం చూపాయి.
Samayam Telugu stock


సోమవారం (ఏప్రిల్ 30) ఉదయం దేశీయ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఆది నుంచే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లకు లాభాల పంట పండింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 0.8 శాతం లాభపడటం గమనార్హం. నేటి ట్రేడింగ్‌లో అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే నడిచాయి.

ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఎల్‌అండ్‌‌టీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, గెయిల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.