యాప్నగరం

Stock Market Today: మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ మిస్

ముడి చమురు ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి విలువ బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది.

Samayam Telugu 16 Oct 2018, 4:53 pm
క్రితం సెషన్‌లో ఓ మోస్తరు లాభాలతో ముగిసిన మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్‌ను మంచి లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 35 వేల పాయింట్ల స్థాయికి చేరగా, నిఫ్టీ 10,500 స్థాయిని దాటింది. ఉదయం సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ కూడా మంచి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. ముడి చమురు ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి విలువ బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో లాభాలు కొనసాగాయి.
Samayam Telugu bull.


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 297.38 పాయింట్లు లాభపడి 35,162.48 వద్ద, నిఫ్టీ 72.25 పాయింట్ల నష్టంతో 10,584.75 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 24 పైసలు బలపడి 73.59 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది.

ఎన్‌ఎస్‌ఈలో మహింద్రా & మహింద్రా (+3.83), అదానీ పోర్ట్స్‌ (+3.77), టెక్ మహింద్రా (+3.48), ఓఎన్‌జీసీ (+3.40), ఎస్‌బీఐ (+2.70) సంస్థలు అధికంగా లాభపడ్డాయి. మరోవైపు ఇండియా బుల్స్ (-4.38), ఐషర్ మోటార్స్ (-1.84), సిప్లా (-1.25), భారతీ ఇన్‌ఫ్రాటెల్ (-0.87), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (-0.85) ఎక్కువ నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.