యాప్నగరం

తొమ్మిది రోజుల మార్కెట్ జోరుకు బ్రేక్...!

స్టాక్‌మార్కెట్ జోరుకు నేటితో బ్రేకులుపడ్డాయి. వరుసగా 9 రోజులపాటు లాభాల బాటలో నడిచిన స్టాక్‌మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 18) నష్టాలను చవిచూశాయి.

Samayam Telugu 18 Apr 2018, 4:54 pm
స్టాక్‌మార్కెట్ జోరుకు నేటితో బ్రేకులుపడ్డాయి. వరుసగా 9 రోజులపాటు లాభాల బాటలో నడిచిన స్టాక్‌మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 18) నష్టాలను చవిచూశాయి. మంగళవారం (ఏప్రిల్ 17) 34,395 వద్ద ముగిసిన సెన్సెక్స్... ఈ ఉదయం వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. చివరలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 63.38 పాయింట్ల నష్టంతో 34,331.68పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా నిన్నటి రోజు(10,549)తో 22.50 పాయింట్లు నష్టపోయి 10,526.20 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.65.62గా ఉంది.
Samayam Telugu market.


గెయిల్‌, విప్రో, ఐటీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌పీసీఎల్‌, టైటాన్‌ కంపెనీ, లుపిన్‌, తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.