యాప్నగరం

Stock Market News: అమ్మకాల సెగ.. లాభాలకు బ్రేక్!

ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి.

Samayam Telugu 4 Dec 2018, 12:14 pm
వరస లాభాలతో దూసుకుపోతున్న దేశీయ మార్కెట్ల జోరుకు మంగళవారం ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం, దేశీయంగా జీడీపీ గణాంకాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 12.00 గంటల సమయానికి సెన్సెక్స్‌ 156 పాయింట్ల నష్టంతో 36,084 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 10,847 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 70.37 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu sensex


ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్, విప్రో, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, యూపీఎల్ తదితర షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, మహింద్రా & మహింద్రా, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.