యాప్నగరం

Stock Market Today: మార్కెట్లకు 'పెట్రో' షాక్.. 35 వేల దిగువకు సెన్సెక్స్

దేశీయ సూచీలు ఈరోజు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. రూపాయి పతనం, ముడి చమురు ధరలు పెరగడంతో గురువారం మార్కెట్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 5 Oct 2018, 11:01 am
గురువారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు శుక్రవారం (అక్టోబరు 5) కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. రూపాయి పతనం, ముడి చమురు ధరలు పెరగడంతో గత ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఏకంగా 800పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 250పాయిట్లకు పైగా పడిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్‌ 220 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 110 పాయింట్లకు పైగా నష్టంతో ఆరంభించింది. ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఓఎన్‌జీసీ, గెయిల్‌, రిలయన్స్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా ఎంఆర్‌పిఎల్‌ ఇలా అన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Samayam Telugu market


ఉదయం 10.45 సమయానికి సెన్సెక్స్‌ 330 పాయింట్ల నష్టంతో 34838 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 10472 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.58 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో టైటాన్‌, ఐషర్‌ మోటార్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తదితర కంపెనీలు లాభపడుతున్నాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో తదితర కంపెనీలు నష్టపోతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.