యాప్నగరం

Stock Market: న‌ష్టాల‌తో ముగిసిన దేశీయ మార్కెట్లు

శుక్రవారం మార్కెట్లకు కలిసిరాలేదు. ఉదయం ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. తర్వాత నష్టాల బాటపట్టాయి. ఇక ఏ దశలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేదు.

Samayam Telugu 24 Aug 2018, 3:50 pm
శుక్రవారం మార్కెట్లకు కలిసిరాలేదు. ఉదయం ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. తర్వాత నష్టాల బాటపట్టాయి. ఇక ఏ దశలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 38,251.8 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా క్రితం రోజుతో పోలిస్తే 25 పాయింట్లు కోల్పోయి 11,557 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.07గా ఉంది. బంగారం ధర 47 పాయింట్లు పెరిగి 29,655 వద్ద స్థిరపడింది.
Samayam Telugu market


ఎన్‌ఎస్‌ఈలో భెల్, అపోలో, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ తదితర షేర్లు లాభాలతో ముగిశాయి. మరోవైపు యస్ బ్యాంకు, సన్ టీవీ, యునైటెడ్ బేవరీస్, ఎల్ & టీ, కెల్టన్ టెక్, హాత్‌వే తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.