యాప్నగరం

Stock Market Today: ఆరంభ లాభాలు ఆవిరి.. మూడో రోజూ నష్టాలే

మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపడం, ముడిచమురు ధరలు పెరగడంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు నష్టాలతో ముగిశాయి.

Samayam Telugu 19 Sep 2018, 5:27 pm
దేశీయ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలనే చవిచూశాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో బుధవారం ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ లాభాలు ఎంతోసేపు నిలువలేదు. మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపడం, ముడిచమురు ధరలు పెరగడంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ట్రేడింగ్‌లో ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.
Samayam Telugu Trader_sensex_nifty_stock_market_stocks_q-770x433


ఒక దశలో 200 పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్‌ ట్రేడింగ్ ముగిసే సమయానికి 169.45 పాయింట్ల నష్టంతో 37121.22 వద్ద, నిఫ్టీ 44..55 పాయింట్ల నష్టంతో 11234.35 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పుంజుకుని రూ.72.82 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. 119 (38%) పాయింట్లు పెరిగిన బంగారం ధర 30,912 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ పెట్రోలియం (+2.80), కోల్‌ఇండియా (+2.73), గెయిల్‌ (+2.60), టెక్‌మహింద్రా గెయిల్‌ (+2.02), ఓఎన్జీసీ (+1.73) షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (-3.30), ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ (-3.09), జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (-2.96), బజాజ్‌ ఫైనాన్స్‌ (-2.76), యూపీఎల్ (-2.36) టాప్ లూజర్లుగా నిలిచాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.