యాప్నగరం

Stock Market News: ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు

శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవుదినం కావడంతో గురువారంతో ఈ వారం ట్రేడింగ్ నష్టాలతో ముగిసింది.

Samayam Telugu 22 Nov 2018, 4:59 pm
గురువారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. కొనుగోళ్ల అండతో ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే సాగినప్పటికీ.. ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, వినియోగ, లోహ, ఫార్మా, చమురు రంగ సంస్థల షేర్లు నష్టపోవడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవుదినం కావడంతో గురువారంతో ఈ వారం ట్రేడింగ్ ముగిసింది.
Samayam Telugu sensex-down


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 218.78 పాయింట్ల నష్టంతో 34981 వద్ద ముగియగా.. నిఫ్టీ 73.30 పాయింట్ల నష్టంతో 10526.75 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు కూడా 'బేర్'మన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 52 పైసలు బలపడి 70.94 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో జీఎంటర్‌టెయిన్ (+4.59), అదానీ పోర్ట్స్ (+1.91), లార్సెన్ (+0.57), ఓఎన్‌జీసీ (+0.33), హెచ్‌డీఎఫ్‌సీ (+0.30) అధికంగా లాభపడగా.. మహింద్రా & మహింద్రా (-2.99), ఐవోసీ (-2.37), గ్రాసిమ్ (- 2.36), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.31), హిండాల్కో (-2.26) తదితర సంస్థల షేర్లు నష్టాల్లో ముగిశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.