యాప్నగరం

Stock Market Today: న‌ష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. పదివేల స్థాయికి నిఫ్టీ

నేటి ట్రేడింగ్‌లో ప్రధానంగా ఐటీ, మెటల్, బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా నవంబరు డెరివేటివ్‌ సిరీస్‌ను సూచీలు భారీ నష్టాలతోనే ప్రారంభించాయి.

Samayam Telugu 26 Oct 2018, 5:43 pm
వారాంతంలో దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. అమ్మకాల జోరుకు ఆసియా మార్కెట్ల బలహీనత తోడవడంతో సూచీలు నేలచూపుకే పరిమితమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ నుంచి నష్టాల్లోనే సాగిన సూచీలు.. ఏ దశలోనూ కోలుకునేట్లు కనిపించలేదు. ఉదయం ఆరంభంలోనే 150 పైగా పాయింట్ల మేర నష్టంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. నిఫ్టీ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. ఓ దశలో సెన్సెక్స్ 300 పాయింట్ల వరకూ పతనమైంది. నేటి ట్రేడింగ్‌లో ప్రధానంగా ఐటీ, మెటల్, బ్యాంకింగ్‌, ఫార్మా రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా నవంబరు డెరివేటివ్‌ సిరీస్‌ను సూచీలు భారీ నష్టాలతోనే ప్రారంభించాయి.
Samayam Telugu sensex-l-express-photo-1


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 340.78 పాయింట్లు కోల్పోయి 33,349.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 94.9 పాయింట్ల నష్టంతో 10,030 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 17 పైసలు క్షీణించి రూ. 73.46 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి.

యూపీఎల్ (3.88), టైటన్ కంపెనీ (1.98), టాటా మోటార్స్ (1.91), బజాజ్ ఆటో (1.46), రిలయన్స్ (1.37) సంస్థలు షేర్లు అధికంగా లాభపడగా.. యస్ బ్యాంక్ (-8.90), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (-4.51), యాక్సిస్ బ్యాంక్ (-4.16), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (-3.81), గ్రాసిమ్ (-3.27) షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.