యాప్నగరం

Stock Market: ఆగని రూపాయి పతనం.. దేశీయ మార్కెట్లు కుదేలు

మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.78 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక స్థితిలో రూపాయి విలువ 71.96కి పడిపోయి జీవనకాల కనిష్ఠ స్థాయిని తాకింది.

Samayam Telugu 5 Sep 2018, 4:22 pm
వరుసగా ఆరోరోజు కూడా స్టాక్‌మార్కెట్లు నష్టాలనే చవిచూశాయి. ఉదయం నుంచి దేశీయ సూచీలు నష్టాల బాటలోనే పయనించాయి. ఉదయం 38,192 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్ ఒక దశలో 38,000 పాయింట్లకు పడిపోయి 37,772.42 స్ధాయికి చేరింది. తర్వాత కాస్త కోలుకుని మళ్లీ 38,000 పాయింట్ల స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే పయనించింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఆరంభంలో 120 పాయింట్లకు పైగా నష్టపోయి 11,500 పాయింట్ల దిగువకు పడిపోయింది.
Samayam Telugu rupee


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్ల నష్టంతో 38,018.31 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 11,476.95 వద్ద ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.78 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక స్థితిలో రూపాయి విలువ 71.96కి పడిపోయి జీవనకాల కనిష్ఠ స్థాయిని తాకింది. బంగారం ధరలోనూ పెరుగుదల నమోదైంది. 166 పాయింట్లు పెరిగి 30,344 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఎన్ఎస్‌ఈలో రిలయన్స్, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్ షేర్లు మోస్ట్ యాక్టివ్‌గా నిలిచాయి. యస్ బ్యాంక్, వేదాంత, హిండాల్కో, విప్రో, టాటా మోటార్స్ షేర్లు లాభాలతో ముగియగా.. భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యూలర్, హెచ్‌యూఎల్, జీ ఎంటర్‌టెయిన్, టైటన్ కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.