యాప్నగరం

Stock Market News: భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు.. ఎన్‌ఎస్‌ఈలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, హెచ్‌యూఎల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Samayam Telugu 19 Oct 2018, 10:55 am
క్రితం ట్రేడింగ్‌లో నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. దసరా తర్వాత రోజైన శుక్రవారం (అక్టోబరు 19) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ సైతం 100 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఉదయం 10.15 గంటల సమయానికి సెన్సెక్స్‌ 269 పాయింట్ల నష్టంతో 34,510 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో 10,359 పాయంట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి 73.49 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu Stock.


ఎన్‌ఎస్‌ఈలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, హెచ్‌యూఎల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఇండియాబుల్స్ హౌసింగ్, యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హీరో మోటో కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.