యాప్నగరం

Stock Market: నష్టాల్లోనే కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు

ట్రేడింగ్ ఆరంభంలోనే మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీల నష్టాలకు కారణమైంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, మెటల్ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది.

Samayam Telugu 1 Oct 2018, 11:02 am
క్రితం ట్రేడింగ్‌లో నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు... సోమవారం(అక్టోబరు 1) కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 90 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్; 10,900 పాయింట్ల దిగవన నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభించాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీల నష్టాలకు కారణమైంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, మెటల్ షేర్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది.
Samayam Telugu sensex


ఉదయం 10.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 90 పాయింట్ల నష్టంతో 36,136 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు నష్టంతో 10,890 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 33 పైసలు నష్టపోయి రూ.72.82 వద్ద కొనసాగుతోంది.

కొటక్‌ మహింద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతి సుజుకీ తదితర షేర్లు నష్టాల్లో సాగుతుండగా.. యెస్ బ్యాంక్ షేర్లు నష్టాల నుంచి కోలుకుని స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.