యాప్నగరం

Stock Market Today: నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు.. కారణాలివే

ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయిల్ సంస్థ షేర్లు పతనమయ్యాయి. దీనికి తోడు రూపాయి పతనమవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.

Samayam Telugu 30 Oct 2018, 4:17 pm
సోమవారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచే నిన్నటి లాభాలను కోల్పోయిన సూచీలు ఆద్యంతం ఒడుదొడుకుల్లోనే సాగాయి. ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఆయిల్ సంస్థ షేర్లు పతనమయ్యాయి. దీనికి తోడు రూపాయి పతనమవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
Samayam Telugu sensex


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 176 పాయింట్ల నష్టంతో 33891.13 వద్ద, నిఫ్టీ 52.45 పాయింట్ల నష్టంతో 10198.4 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 19 పైసలు క్షీణించి 73.64 వద్ద కొనసాగుతోంది.ట్రేడింగ్‌లో నిఫ్టీ50 నష్టాల్లో ముగిసినప్పటికీ.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ (+85.30), నిఫ్టీ మిడ్‌క్యాప్ (115.75) లాభాలను ఆర్జించడం విశేషం.

ఎన్‌ఎస్‌ఈలో టెక్ మహింద్రా (+3.14), జీ ఎంటర్‌టైన్‌మెంట్ (+3.05), గ్రాసిమ్ (+2.85), హెచ్‌యూఎల్ (+2.59), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (+2.42) టాప్ గెయినర్స్‌గా నిలువగా.. హెచ్‌పీసీఎల్ (-4.58), కోల్ ఇండియా (-4.02), బీపీసీఎల్ (-3.97), సిప్లా (-3.90), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (-3.64) తదితర షేర్లు నష్టాలతో ముగిశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.