యాప్నగరం

Stock Market News: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్లు

అంత‌ర్జాతీయంగా సానుకూల పరిణామాలు, ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లకు కాస్త కలిసొచ్చింది.

Samayam Telugu 14 Dec 2018, 5:33 pm
దేశీయ మార్కెట్లు శుక్రవారం (డిసెంబరు 14) స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. తర్వాత కొద్ది సేపటికి లాభాల బాట పట్టింది. సెన్సెక్స్‌ 30 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 10,800 పాయింట్లకు పైనే స్థిరపడింది. అంత‌ర్జాతీయంగా సానుకూల పరిణామాలు, ప్రధాన షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లకు కలిసొచ్చింది.
Samayam Telugu Stock Markets


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33.29 పాయింట్ల లాభంతో 35962.93 వద్ద, నిఫ్టీ 13.9 పాయింట్ల లాభంతో 10805.45 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 30 పైసలు క్షీణించి 71.99 వద్ద కొనసాగుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూపాయి 20 పైసలు దాకా క్షీణించింది.

ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్ (+5.33), యస్ బ్యాంక్ (+3.23), బీపీసీఎల్ (+3.11), ఐవోసీ (+2.80), ఓఎన్‌జీసీ (+2.48) షేర్లు అధికంగా లాభపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ (-1.95), హెచ్‌సీఎల్ టెక్ (-1.72), జేఎస్‌డబ్ల్యూ (-1.66), విప్రో (-1.64), టైటన్ కంపెనీ (-1.34)లతో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.