యాప్నగరం

స్టాక్ మార్కెట్ల జోరు.. కీలక మైలురాయికి 34 పాయింట్ల దూరంలో నిఫ్టీ

స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త శిఖరాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ ఆల్‌టైం రికార్డుకు చేరగా.. నిఫ్టీ 11 వేలకు 34 పాయింట్ల దూరంలో నిలిచిచింది.

TNN 22 Jan 2018, 5:38 pm
స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగిస్తున్నాయి. గతవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు.. సోమవారం (జనవరి 22) కూడా అదే ఉత్సాహంతో దూసుకెళ్లాయి. సరికొత్త శిఖరాలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ ఆల్‌టైం రికార్డుకు చేరగా.. నిఫ్టీ ఓ దశలో 11000 మైలురాయిని అందుకునేలా కనిపించింది. చివరికి 11 వేలకు 34 పాయింట్ల దూరంలో నిలిచిచింది.
Samayam Telugu sensex ends at new high of 35798 nifty closes at 10966
స్టాక్ మార్కెట్ల జోరు.. కీలక మైలురాయికి 34 పాయింట్ల దూరంలో నిఫ్టీ


సోమవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. కొనుగోళ్ల మద్దతుతో ఆద్యంతం జోరుగా సాగాయి. 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌.. ఆ తర్వాత మరింత పుంజుకుంది. నిఫ్టీ కూడా కొత్త రికార్డువైపు దూసుకెళ్లింది.

మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 286 పాయింట్లు ఎగబాకి 35,798 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 10,966 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.77గా కొనసాగుతోంది. నెలాఖరులో వెలువడనున్న బడ్జెట్‌పై సానుకూలంగా ఉన్న మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడంతో సూచీలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.