యాప్నగరం

కొత్త రికార్డుతో ముగిసిన సెన్సెక్స్‌..

ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో శుక్రవారం (అక్టోబర్ 27) ఉదయం స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. నిన్నటి ఊపును కొనసాగిస్తూ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడి సరికొత్త రికార్డుల్లో ట్రేడింగ్‌ ఆరంభించింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో లాభనష్టాల్లో ఊగిసలాడింది. చివరకు సూచీ స్వల్పంగా 10.09 పాయింట్లు లాభపడి 33,157.22 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది.

TNN 27 Oct 2017, 9:52 pm
ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో శుక్రవారం (అక్టోబర్ 27) ఉదయం స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. నిన్నటి ఊపును కొనసాగిస్తూ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడి సరికొత్త రికార్డుల్లో ట్రేడింగ్‌ ఆరంభించింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో లాభనష్టాల్లో ఊగిసలాడింది. చివరకు సూచీ స్వల్పంగా 10.09 పాయింట్లు లాభపడి 33,157.22 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది. అటు నిఫ్టీ మాత్రం నిన్నటి రికార్డుల నుంచి కిందకు పడిపోయింది. నేటి ట్రేడింగ్‌లో 23.50 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ.. 10,320.30 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.99గా కొనసాగుతోంది.
Samayam Telugu sensex ends at new peak nifty falls 20 points
కొత్త రికార్డుతో ముగిసిన సెన్సెక్స్‌..


మొత్తంమీద వారాంతంలో దేశీయ సూచీలు స్తబ్దుగా ముగిశాయి. ఆరంభ ట్రేడింగ్‌లో కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లినా.. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో చతికిలపడ్డాయి. దీనికి తోడు బ్యాంకింగ్‌ రంగాల షేర్లు కూడా తడబడ్డాయి. దీంతో సెన్సెక్స్‌ స్వల్ప లాభంతో కొత్త రికార్డుకు ఎగబాకినప్పటికీ.. నిఫ్టీకి మాత్రం నష్టాలు తప్పలేదు.

ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ లాభపడగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి. యస్‌ బ్యాంకు షేరు 7 శాతం మేర పడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.