యాప్నగరం

న‌ష్టాల్లో మార్కెట్లు

తొలుత 125 పాయింట్లవరకూ క్షీణించిన సెన్సెక్స్‌ చివరికి రికవర్‌ అయ్యి 25 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 15 పాయింట్లు తక్కువగా 10,382 వద్ద స్థిరపడింది.

TNN & Agencies 22 Feb 2018, 5:22 pm
ప్రపంచవ్యాప్తంగా మ‌దుప‌ర్లలో తాజాగా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు పెరిగాయి. ఇవి ఆందోళనలకు తెరతీయడంతో స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అటు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ జనవరిలో నిర్వహించిన పాలసీ సమావేశం, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఫిబ్రవరి తొలి వారంలో చేపట్టిన పరపతి సమీక్షల వివరాలు మినిట్స్‌ ద్వారా బుధవారం వెల్లడయ్యాయి. ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్ కమిటీ ఇకపై వడ్డీ రేట్లపెంపువైపు దృష్టిసారించనున్నట్లు సంకేతమివ్వడంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. మానిటరీ పాలసీ కమిటీ రేట్ల తగ్గింపు బాటను వీడి పెంపుదల బాటలో సాగేందుకు ఆసక్తి చూపడంతో దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో మార్కెట్లు ఆద్యంతమూ నష్టాలమధ్యే కదిలాయి. తొలుత 125 పాయింట్లవరకూ క్షీణించిన సెన్సెక్స్‌ చివరికి రికవర్‌ అయ్యి 25 పాయింట్ల స్వల్ప నష్టంతో 33,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 15 పాయింట్లు తక్కువగా 10,382 వద్ద స్థిరపడింది.
Samayam Telugu sensex ends down by 25 points
న‌ష్టాల్లో మార్కెట్లు



బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో స‌న్ ఫార్మా(3.32%), అదానీ పోర్ట్స్(2.16%), కొట‌క్ బ్యాంక్(2.01%), ఇండ‌స్ఇండ్ బ్యాంక్(1.86%), ఎం అండ్ ఎం(1.76%), యెస్ బ్యాంక్(1.36%) బాగా లాభ‌ప‌డిన వాటిలో ముందుండ‌గా మ‌రోవైపు డాక్ట‌ర్ రెడ్డీస్(2.19%), ఓఎన్జీసీ(2.05%), ప‌వ‌ర్ గ్రిడ్(1.88%), టాటా మోటార్స్(1.59%), మారుతి(1.47%), బ‌జాజ్ ఆటో(1.24%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.
నిఫ్టీలో నేడు వివిధ కంపెనీల లాభ‌,న‌ష్ట వివ‌రాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
స‌న్ ఫార్మా(2.99%), అర‌బిందో ఫార్మా(2.78%), అదానీ పోర్ట్స్(2.12%), మహీంద్రా అండ్ మ‌హీంద్రా(1.91%), ఇండియా బుల్స్ హౌసింగ్(1.88%) ఎక్కువ‌గా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు బీపీసీఎల్(4.49%), ఓఎన్జీసీ(2.13%), డాక్ట‌ర్ రెడ్డీస్(1.96%), ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్(1.91%), యూపీఎల్(1.86%) న‌ష్ట‌పోయిన వాటిలో ముందున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.