యాప్నగరం

Stock Market Today: రూపాయి బలపడినా.. ఫ్లాట్‌గానే సూచీలు

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్ల నష్టంతో 34431.97 వద్ద ఫ్లాట్‌గా ముగియగా.. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 10,380 వద్ద ముగిసింది.

Samayam Telugu 1 Nov 2018, 4:48 pm
గురువారం ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం 150 పాయింట్లకు పైగా లాభాలతో సెన్సెక్స్. 10,400 పైనా నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభించాయి. రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్ సంకేతాలతో లాభాల్లో సాగాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 100 పాయింట్ల వరకు నష్టపోయింది. ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటల్ షేర్లు లాభాలను ఆర్జించగా.. ఐటీ, ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
Samayam Telugu sensexdown


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్ల నష్టంతో 34431.97 వద్ద ఫ్లాట్‌గా ముగియగా.. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 10,380 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ మాత్రం 0.8 శాతం లాభంతో 149.80 పాయిట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 36 పైసలు బలపడి 73.60 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో యస్ బ్యాంక్ (+8.48), హిండాల్కో (+3.39), యాక్సిస్ బ్యాంక్ (+3.39) యూపీఎల్ (+3.20), బీపీసీఎల్ (+3.04) షేర్లు అధిక లాభాలు గడించగా.. హెచ్‌సీఎల్ టెక్ (-4.42), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-3.18), టెక్ మహింద్రా (-3.12), భారతీ ఇన్‌ఫ్రాటెల్ (-2.99), ఇన్ఫోసిస్ (-2.87) షేర్లు అధికంగా నష్టపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.