యాప్నగరం

ఐటీ అండతో మార్కెట్లకు లాభాలు

చమురు ధరలు తగ్గడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

Samayam Telugu 28 Nov 2018, 4:26 pm
నేటి ట్రేడింగ్‌లో ఐటీ, విద్యుత్ షేర్లు లాభపడగా.. ఆటో, వినియోగం, ఇన్‌ఫ్రా, మెటల్ రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడటం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203.81 పాయింట్ల లాభంతో 35716.95, నిఫ్టీ 43.25 పాయింట్ల లాభంతో 10728.85 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడి 70.65 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu sensex1


నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టీసీఎస్ (+4.95), ఇన్ఫోసిస్ (+4.30), జీ ఎంటర్‌టైన్‌మెంట్ (+3.95), రిలయన్స్ (+2.17), హెచ్‌సీఎల్ టెక్ (+1.95) సంస్థలు అధిక లాభాలను ఆర్జించగా.. యస్ బ్యాంక్ (-11.25), బీపీసీఎల్ (-4.58), భారతీ ఎయిర్‌టెల్ (-4.28), ఐవోసీ (-3.18), టాటా మోటార్స్ (-3.11) సంస్థలు అధిక నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.