యాప్నగరం

Stock Market News: సూచీలకు చమురోత్సాహం.. మార్కెట్లకు లాభాలు

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం షేర్లు భారీగా లాభపడ్డాయి.

Samayam Telugu 13 Nov 2018, 4:56 pm
గత ట్రేడిండ్‌లో నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌ను మంచి లాభాలతో ముగించాయి. ఉదయం సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 34,846 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ 10,450 పాయింట్ల పైన ట్రేడింగ్‌ ఆరంభించింది. అయితే సూచీలు అంతలోనే ఒడుదొడుకులకు గురయ్యాయి. ఆరంభ లాభాల నుంచి నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్‌లో ప్రధానంగా ఆయిల్ సంస్థల షేర్లు లాభాలను గడించాయి. ముఖ్యంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం షేర్లు భారీగా లాభపడ్డాయి. చమురు ధరల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు సౌదీ ప్రకటించడం ఆయిల్ సంస్థలకు వరంగా మారింది.
Samayam Telugu sensex-up


మరోవైపు బ్యాంకులు, ఆటో, లోహ, మౌలిక షేర్లు కూడా ట్రేడింగ్‌లో రాణించడంతో.. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 331.50 పాయింట్లు లాభపడి 35144.49 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100.3 పాయింట్లు లాభపడి 10582.50 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు లాభపడి రూ.72.63 వద్ద ట్రేడవుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో ఐషర్ మోటార్స్ (+5.96), ఐవోసీ (+4.70), బీపీసీఎల్ (+4.10), హెచ్‌పీసీఎల్ (+3.44), అల్ట్రాటెక్ సిమెంట్ (+2.77) షేర్లు అధికంగా లాభపడ్డాయి. మరోవైపు సన్ ఫార్మా(-4.71), టాటా మోటార్స్ (-3.52), ఇండియాబుల్స్ హౌసింగ్ (-2.69), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (-1.02), సిప్లా (-0.71) షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.