యాప్నగరం

Stock Market News: కొనుగోళ్ల సందడి.. మార్కెట్లు శుభారంభం

ట్రేడింగ్‌లో ప్రధానంగా ఐటీ, విద్యుత్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల తాకిడి పెరిగింది.

Samayam Telugu 22 Nov 2018, 10:45 am
రెండురోజుల వరస నష్టాలతో కుదేలైన మార్కెట్లు.. గురువారం కోలుకున్నాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఆరంభ ట్రేడింగ్‌నే సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ కూడా 10,600 పైన ట్రేడింగ్ ప్రారంభించాయి. ట్రేడింగ్‌లో ప్రధానంగా ఐటీ, విద్యుత్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల తాకిడి పెరిగింది.
Samayam Telugu bull.


ఉదయం 10.45 గంటల సమయానికి సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 35347.80 వద్ద, నిప్టీ 37.25 పాయింట్ల లాభంతో 10637 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 31 పైసలు బలపడి 71.15 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్ఈలో యస్ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్, టెక్ మహింద్రా, ఓఎన్‌జీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌పీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ, బీపీసీఎల్ సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.