యాప్నగరం

Stock Market: మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లను కోల్పోయి 38,645 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 11,680 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.99 వద్ద ముగిసింది.

Samayam Telugu 31 Aug 2018, 5:48 pm
శుక్రవారం నాటి మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. సెన్సెక్స్ నష్టాలతో ముగియగా.. నిఫ్టీ స్వల్ప లాభంతో ముగిసింది. ఉదయం నష్టాల నుంచి కోలుకుని 100 పాయింట్లకుపైగా పుంజుకున్న కీలక సూచీలు.. చివరి వరకు ఆ జోరును కొనసాగించలేకపోయాయి. బ్యాంకింగ్‌, లోహ, విద్యుత్‌, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒత్తిడికి గురైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
Samayam Telugu market1


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లను కోల్పోయి 38,645 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 11,680 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.99 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో మరింత పతనమైన రూపాయి ఒక దశలో 71 మార్క్‌ను తాకి జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. రూపాయి విలువ 71ని తాకడం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం 70.99 వద్ద కొనసాగుతోంది.

నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌, ఆయిల్‌, మెటల్‌ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ, ఫార్మా రంగాలు లాభపడ్డాయి.హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్ మహీంద్ర, భారతి ఇన్‌ఫ్రాటెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌ బ్యాంక్‌, వేదాంత, ఐసీఐసీఐ, భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.