యాప్నగరం

Stock Market Today: అంతర్జాతీయ సానుకూల పరిణామాలు.. లాభాల్లో మార్కెట్లు

శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ ఉదయం సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది.

Samayam Telugu 17 Aug 2018, 11:07 am
శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఈ ఉదయం సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. నిఫ్టీ మాత్రం 11,400 పాయింట్లకు దిగువనే ప్రారంభమైంది. మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో..బ్యాంకింగ్‌, లోహ, ఔషధ, ఆటోమొబైల్‌, విద్యుత్ రంగ షేర్లు లాభాల బాట పట్టడంతో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 10.45 సమయానికి సెన్సెక్స్ 290.69 (0.77%) పాయింట్ల లాభంతో 37,954.25 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 84.80 (0.74%) పాయింట్ల లాభంతో 11,469.85 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.15 వద్ద కొనసాగుతోంది.
Samayam Telugu market31


చైనా, అమెరికా దేశాల మధ్య వచ్చేవారంలో జరగనున్న వాణిజ్య చర్చలు, టర్కీలో పరిస్థితి మెరుగుపడటం స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్‌లో యాక్సిస్‌ బ్యంక్‌, సన్‌ఫార్మా, మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టెక్‌ మహింద్రా, భారత్‌ పెట్రోలియం, ఎయిర్‌టెల్‌ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.