ఈ రోజు ట్రేడింగ్లో సూచీలు గణనీయమైన లాభాలను గడించాయి. అంతర్జాతీయ ప్రభావంతో నిలకడగా ట్రేడింగ్ ప్రారంభమైనా.. అంతకంతకూ ఇండెక్స్లు లాభాలు పెంచుకున్నాయి. ఇండెక్స్లు కీలక స్థాయిలో ఉండటంతో మదుపర్లు కూడా ఆచితూచి ట్రేడ్ చేసినా.. మిడ్ సెషన్ సమయానికి సానుకూలంగా ఉన్న ఇండెక్స్లకు.. కేంద్రం నుంచి మద్దతు ధర రూపంలో సపోర్ట్ లభించింది. దీంతో మార్కెట్లు మరింతగా దూసుకెళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో 35,647 వద్ద ముగియగా, మర సూచీ నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 10,770 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్ ముగిసే సరికి నిఫ్టీ సూచీలో బజాజ్ ఆటో (4.42%), లుపిన్ (3.86%), మారుతి సుజుకీ(2.78%), బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (2.55%), హెచ్డీఎఫ్సీ (2.30%) షేర్లు లాభపడగా.. మరో వైపు హిందుస్థాన్ పెట్రోలియం(2.59%), గ్రాసిమ్ (2.01%), సిప్లా (1.98%), ఎన్టీపీసీ(1.58%), వేదాంతా లిమిటెడ్ (1.32%) షేర్లు నష్టపోయాయి.
ట్రేడింగ్ ముగిసే సరికి నిఫ్టీ సూచీలో బజాజ్ ఆటో (4.42%), లుపిన్ (3.86%), మారుతి సుజుకీ(2.78%), బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (2.55%), హెచ్డీఎఫ్సీ (2.30%) షేర్లు లాభపడగా.. మరో వైపు హిందుస్థాన్ పెట్రోలియం(2.59%), గ్రాసిమ్ (2.01%), సిప్లా (1.98%), ఎన్టీపీసీ(1.58%), వేదాంతా లిమిటెడ్ (1.32%) షేర్లు నష్టపోయాయి.