లాభపడ్డ ఐటీ రంగ షేర్లు
తొలుత నష్టాలతో మొదలైనప్పటికీ చివరికి దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. దీంతో రెండు రోజుల భారీ నష్టాలకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు సెషన్ల నష్టాలను కాదని ఈ రోజు మార్కెట్లు మదుపరికి ఊరటనిచ్చాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 32,997 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 10,124 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల పతనం, ఫెడ్ పాలసీ సమీక్ష, దేశీయంగా రాజకీయ అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే పుంజుకుని రోజు మొత్తం పటిష్ట లాభాలతో కదిలాయి. సెన్సెక్స్ 33,102 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాటా స్టీల్(3.17%), సన్ ఫార్మా(2.20%), డాక్టర్ రెడ్డీస్(1.85%), విప్రో(1.54%), అదానీ పోర్ట్స్(1.47%), హెచ్డీఎఫ్సీ(1.38%) లాభపడ్డ వాటిలో ముందుండగా, మరో వైపు ఓఎన్జీసీ(1.13%), ఐసీఐసీఐ బ్యాంక్(1.10%), యెస్ బ్యాంక్(0.92%), రిలయన్స్(0.64%), హెచ్ డీఎఫ్సీ బ్యాంక్(0.56%), కొటక్ బ్యాంక్(0.55%) ఎక్కువగా నష్టపోయాయి.
తొలుత నష్టాలతో మొదలైనప్పటికీ చివరికి దేశీయ స్టాక్ మార్కెట్లు ఓ మోస్తరు లాభాలతో ముగిశాయి. దీంతో రెండు రోజుల భారీ నష్టాలకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు సెషన్ల నష్టాలను కాదని ఈ రోజు మార్కెట్లు మదుపరికి ఊరటనిచ్చాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 32,997 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 10,124 వద్ద స్థిరపడింది. అమెరికా, ఆసియా మార్కెట్ల పతనం, ఫెడ్ పాలసీ సమీక్ష, దేశీయంగా రాజకీయ అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. అయితే వెనువెంటనే పుంజుకుని రోజు మొత్తం పటిష్ట లాభాలతో కదిలాయి. సెన్సెక్స్ 33,102 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో టాటా స్టీల్(3.17%), సన్ ఫార్మా(2.20%), డాక్టర్ రెడ్డీస్(1.85%), విప్రో(1.54%), అదానీ పోర్ట్స్(1.47%), హెచ్డీఎఫ్సీ(1.38%) లాభపడ్డ వాటిలో ముందుండగా, మరో వైపు ఓఎన్జీసీ(1.13%), ఐసీఐసీఐ బ్యాంక్(1.10%), యెస్ బ్యాంక్(0.92%), రిలయన్స్(0.64%), హెచ్ డీఎఫ్సీ బ్యాంక్(0.56%), కొటక్ బ్యాంక్(0.55%) ఎక్కువగా నష్టపోయాయి.