యాప్నగరం

Stock Market Today: బలపడ్డ రూపాయి.. మార్కెట్లకు శుభారంభం

ట్రేడింగ్‌లో ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.

Samayam Telugu 12 Nov 2018, 10:45 am
సోమవారం (నవంబరు 12) స్టాక్ మార్కెట్లు శుభారంభం చేశాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే రూపాయి బలపడటంతో సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ట్రేడింగ్ ఆరంభించగా.. నిఫ్టీ 10,600 పైన ట్రేడింగ్ ఆరంభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి.
Samayam Telugu bull.


ఉదయం 9.45 గంటల సమయానికి సెన్సెక్స్ 133 పాయింట్లకు పైగా లాభంతో 35291 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 10630 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 21 పైసలు బలపడి 72.79 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో టెక్ మహింద్రా, టైటన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలతో ప్రారంభం కాగా.. హెచ్‌సీఎల్, ఐవోసీ, యస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్ సంస్థల షేర్లు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.